logo

కొడిమ్యాలలో ఆధార్ కేంద్రం సేవలను కొనసాగించాలి.

కొడిమ్యాల:జూన్ 28.

కొడిమ్యాల మండల కేంద్రంలోని ఆధార్ కేంద్రంను కొనసాగించి ప్రజలకు సేవలు అందించాలని కొడిమ్యాల మాజీ మండల బిజెపి అధ్యక్షుడు, ఆర్టిఐ జిల్లా అధ్యక్షుడు ఐన అక్కపెల్లి రవీందర్ మండల తహసీల్దార్ కి, జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందించినట్లు తెలిపారు.గత కొన్ని రోజులుగా ఆధార్ సెంటర్ సేవలను కొనసాగించకపోవడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన తెలిపారు. ఆధార్ సవరణల నిమిత్తము ప్రజలు జగిత్యాల జిల్లా కేంద్రమునకు,మల్యాల మండల కేంద్రమునకు లేదా గంగాధర మండల కేంద్రమునకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.సాధారణ పౌరులు ఇబ్బంది పడకుండా వెంటనే కొడిమ్యాల మండల కేంద్రంలో ఆధార్ సేవలు కొనసాగించాలని అందుకు తగుచర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరారు.

76
8048 views