logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

14 ఏళ్ల నిరీక్షణకు మోక్షం కలిగింది

ఈనెల 17న భీమవరం బ్రిడ్జికు పవన్ కళ్యాణ్ చే శంకుస్థాపన
*14 ఏళ్ల నిరీక్షణకు మోక్షం కలిగింది.
*రూ 22 కోట్లతో రెండు బ్రిడ్జిలు, ఒక సీసీ రోడ్డుకు శంకుస్థాపన ఎమ్మెల్యే అంజిబాబు.

భీమవరం :
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యనమదుర్రు బ్రిడ్జిలకు మోక్షం కలిగిందని, ఈనెల 17వ తేదీ ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. బుధవారం వారి కార్యాలయంలో మాట్లాడారు. 14 ఏళ్ల నిరీక్షణకు మోక్షం కలిగిందని, రూ 7 కోట్లతో గొల్లవాని తిప్ప బ్రిడ్జి, రూ 20 కోట్ల భీమవరం బ్రిడ్జి లకు అప్రోచ్ వేయడానికి ఈనెల 17న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారని అన్నారు. అదే విధంగా డిఎన్నార్ కళాశాల వద్ద రూ 2 కోట్లతో పూర్తి చేసిన సిమెంట్ రోడ్డును కూడా వర్చువల్ గా పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారని తెలిపారు. ఈ మహోత్తర కార్యక్రమానికి కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తెలుగు మహిళలు ప్రజలందరూ పాల్గొనాలని కోరారు.

1
87 views

Comment