logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

SC వర్గీకరణ చెయ్యాలని ఏ పార్టీ చూసిన సహించేది లేదు -గోగులమూడి రాము

యస్సి వర్గీకరణ చేయాలనీ ఏ పార్టీ చూసిన సహించేది లేదు -గోగులమూడి రాము

యస్సి వర్గీకరణ చేయాలనీ ఏ పార్టీ చూసిన సహించేది లేదు అని జై మాల మహానాడు అధ్యక్షులు హెచ్చరించారు విజయవాడ మీడియా సమావేశం లో మాట్లాడుతూ మొన్న పీవీ రావు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పండు అశోక్ కుమార్ గారి పిలుపు మేరకు ఢిల్లీ నడి బొడ్డున మూడు వందల మంది తో నిరసన దీక్ష చేయడం జరిగింది. రానున్న రోజులలో కూడా ఎటువంటి వర్గీకరణ జరుగుతుంది అని సంకేతాలు వచ్చిన మా పోరాటం ఉదృతం చేస్తామని మాల ల సత్తా ఏంటో చూపిస్తామని తెలియచేసారు. తెలంగాణ లో మోదీ గారు వచ్చి తెలంగాణ ఎన్నికల దృష్ట్యా హామీ ఇచ్చారు కానీ ఎన్నికల్లో ఆ హామీ ప్రభావం ఉపయోగం లేకుండా పోయింది.కొంతమంది నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసమే తప్ప జాతి గురించి అలోచించకుండా జాతి ని తాకట్టు పెట్టె పరిస్థితి జరుగుతుంది ఆ విషయం జాతి గమనించాల్సి ఉంది. యస్సి వర్గీకరణ కు వ్యతిరేకం గ రానున్న రోజులలో మరింత పోరాటం చేస్తామని తెలుగు రాష్టాలలో ని నాయకులు అంత ఒకే మాట మీద ఉన్నామని ఉంటామని ఈ సందర్బంగా జై మాల మహానాడు అధ్యక్షులు గోగులమూడి రాము తెలియచేసారు

174
4527 views

Comment