logo

*మాదిగ ఆత్మీయ సమ్మేళనానికి తరలిరావాలని పిలుపు **

జమ్మలమడుగు
నవంబర్ 12


మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు నవంబర్ 17వ తేదీ కడప జిల్లా పర్యటనలో భాగంగా కడప జిల్లాకు వచ్చేస్తున్నారు ఇందులో భాగంగా ప్రతి మాదిగ బిడ్డ కడపలో జరిగే మాదిగ ఆత్మీయ సమ్మేళనానికి తరలిరావాలని తెలిపారు.మైలవరం మండలం గొల్లపల్లి గ్రామంలో మీటింగ్ అనంతరం Mrps మైలవరం మండలం ఇంచార్జిలు మాట్లాడుతూ మన జాతికి జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ఏబిసిడి వర్గీకరణ ద్వారా మన జాతికి జరుగుతున్నటువంటి మేలును గురించి ప్రజలందరికీ చక్కగా వివరించడం జరిగింది అటు తర్వాత నవంబర్ 17వ తారీకు మంద కృష్ణ మాదిగ అన్న గారి ఆత్మీయ మహాసభలకు మాదిగ బిడ్డలంతా తరలిరావాలని అందరికీ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో Mrps నాయకులు సుబ్బగాళ్ళ నరసింహులు, బొంతల ఓబులేసు, బొంతల నాగన్న,పాపగాళ్ళ ఓబయ్య, మేకల ఆంజనేయులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు

145
7688 views