logo

డిప్యూటీ సీఎం మన్యం జిల్లాల పర్యటన

అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ విశాఖ విమానాశ్రాయానికి చేరుకున్నారు.

అక్కడి నుంచి నేరుగా డుంబ్రిగూడ మండలం, పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామానికి బయలుదేరారు. గిరిజన గ్రామాల అభివృద్ధి నిమిత్తం చేస్తూనే “అడవి తల్లి బాట” కార్యక్రమానికి పెదపాడు గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుడతారు.
అంతకు ముందు విమానాశ్రయంలో విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంద్రప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు, యలమంచిలి శాసన సభ్యులు సుందరపు విజయ్ కుమార్, రాష్ట్ర ఎంఎస్ఎంఈ కార్పోరేషన్ ఛైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్, పార్టీ పీఏసీ సభ్యులు కోన తాతారావు, ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ, పార్టీ నేతలు డాక్టర్ సందీప్ పంచకర్ల, శ్రీమతి పసుపులేటి ఉషాకిరణ్, బోడపాటి శివదత్, శ్రీమతి భీశెట్టి వసంత లక్ష్మి తదితరులు ఘన స్వాగతం పలికారు.

0
15 views