logo

బకాయిలు చెల్లించకుంటే మన్ను తిని బ్రతకాలనా! మన్నుతింటు ఉపాధి కూలీలు వినూత్న రీతిలో ఆందోళన

బిల్లులు చెల్లించేవరకు దశలవారీగా ఆందోళన

ఉపాధి హామీ కూలీలకు ఎనిమిది వారాలు బకాయిలు చెల్లించకుంటే మన్ను తిని బ్రతకలానా అంటు శుక్రవారం నాడు చీడికాడ మండలం అర్జునగిరి పని ప్రదేశంలో మన్ను తింటూ కూలీలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు బిల్లులు చెల్లించేవరకు దశల వారిగా ఆందోళన చేస్తామని వారు స్పష్టం చేశారు, వీరికి మద్దతుగా వ్వవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి వెంకన్న పాల్గొని మాట్లాడారు, మార్చి ఇరవై నుండి ఈరోజు వరకు కూలీలకు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందులో పని చేస్తున్న ఉద్యోగులకు సైతం జీతాలు చెల్లించడం లేదని దీని పర్యావసానం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు, ఉపాధి హామీ పథకం అమలు అస్తవ్యస్తంగా మారిందని దుయ్య బట్టారు రాష్ట్ర వ్యాప్తంగా 28 లక్షల శ్రామికుల కుటుంబాలకు రూ.900 కోట్ల మేర కూలీ డబ్బులు బకాయిలుండటంతో పేదలు ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ పథకం కింద పని చేసే దాదాపు 15 వేల మంది ఉద్యోగులు, సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు అందక విలవిలవిలాడి పోతున్నారని తెలిపారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు దొరకని ప్రస్తుత వేసవి రోజుల్లో ఉపాధి హామీ పథకంపై ఆధారపడి జీవించే పేదల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు నిబంధనల ప్రకారం.. ఉపాధి హామీ పథకం పనుల్లో పనిచేసే కూలీలకు 15 రోజుల లోపే వారి పనికి సంబంధించిన కూలీ డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని అయితే, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 27 లక్షల పేద కుటుంబాలకు సంబంధించిన 39 లక్షల మంది పేదలకు రెండు నెలలుగా చేసిన పనులకు కూలీ డబ్బులు చెల్లించలేదని తెలిపారు. ఇలాగైతే ఎలా బ్రతకాలంటూ కూలీలు ఆందోళన చేందుతున్నారని తెలిపారు మరోవైపు మెటీరియల్ కేటగిరిలో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, తదితర పనులు చేసిన వారికి రూ.2,500 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని అధికార వర్గాలే పేర్కొన్నాయని తెలిపారు. మరోవైపు ఉపాధి హామీ పథకం కార్యక్రమాల పర్యవేక్షణకు మండల కంప్యూటర్ సెంటర్ల (ఎంసీసీ) లో పనిచేసే టెక్నికల్ అసిస్టెంట్లు (టీఏ) ఫీల్డ్ అసిస్టెంట్లు మొదలు రాష్ట్ర స్థాయి కార్యాలయంలో పనిచేసే దాదాపు ఏడు వేల మంది వివిధ స్థాయిల ఉద్యోగులకు ఫిబ్రవరి నెల నుండి వేతనం ఇప్పటి వరకు చెల్లించలేదని రెండు రోజులు క్రితం టెక్నికల్ అసిస్టెంట్లకు ఒకనెల జీతం ఇచ్చారని తెలిపారు గ్రామ స్థాయిలో ఉపాధి హామీ పథకం పనులను నిత్యం పర్యవేక్షించే ఫీల్డ్ అసిస్టెంట్లకు, రాష్ట్ర స్థాయి గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే కొన్ని కేటగిరీల ఉద్యోగులు 8 వేల మందికి మార్చి నెల నుంచి వేతనం ఇవ్వలేదన్నారు మొత్తంగా దాదాపు 15 వేల మందికి జీతాలు ఇవ్వక పోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంతటి దౌర్భాగ్యపు పరిస్థితులు మునుపు ఎన్నడు లేవని చేసిన పనులకు వెంటనే బిల్లులు చెల్లించాలి. సమ్మర్ ఎలవెన్సు తట్ట, గునపం మంచి నీళ్ళకు డబ్బులు చెల్లించాలని పే స్లిప్పులు, టెంట్లు, మెడికల్ కిట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో కూలీలు పాల్గొన్నారు.

17
481 views