logo

అమజీవి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా"గా 17 ఏళ్ల ఘనయాత్ర

అనకాపల్లి జిల్లా అనకాపల్లి .నెల్లూరు జిల్లా పేరు "అమజీవి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా"గా మార్చి 17 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, జూన్ 4, 2025న పల్లి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం - శ్రీ పొట్టి శ్రీరాములు జంక్షన్ వద్ద శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి ఘనంగా అభిషేకం, పూలమాలలతో అలంకరణ కార్యక్రమం నిర్వహించబడింది. అనంతరం ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీమతి పీ.వీ.ఎం. నాగజ్యోతి గారు (సంఘ సేవకురాలు, వాసవి వనిత క్లబ్ రీజనల్ సెక్రటరీ, లయన్స్ క్లబ్ నవ్య-నర్సీపట్నం థర్డ్ వైస్ ప్రెసిడెంట్, నింజాస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ బోర్డు డైరెక్టర్) మరియు శ్రీ బిల్లపాటి కృష్ణ కుమార్ గారు (కన్యకా పరమేశ్వరి దేవస్థానం అధ్యక్షులు) హాజరై, శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలలు సమర్పించారు.

ఈ సందర్భంగా తన ప్రసంగంలో శ్రీమతి పీవీఎం నాగజ్యోతి గారు మాట్లాడుతూ –
"తెలుగు భాషా ప్రజల హక్కుల కోసం తన ప్రాణాన్ని అర్పించిన అమర వీరుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని స్మరించుకునే విధంగా, 2008లో భారత ప్రభుత్వం నెల్లూరు జిల్లా పేరును 'పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా'గా అధికారికంగా ప్రకటించింది. ఇది తెలుగు జాతి గౌరవానికి నిలువెత్తు చిహ్నంగా నిలిచింది. ఆయన త్యాగం వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు దారితీసింది. ఈ పేరును తరతరాలవారికి గుర్తుండిపోయేలా మనం చరిత్రను నిలుపుకోవాలి," అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు భవన్ నిర్మాణ నిర్వాహకులు శ్రీ పీఎంఎల్ నరసింహ గారు, శ్రీ గంగుపాం నాగేశ్వరరావు గారు (బిజెపి సీనియర్ నాయకులు) పాల్గొన్నారు.
అతిధులంతా శ్రీరాములు గారి త్యాగాన్ని స్మరించుకుని ఆయన సేవా మూర్తిని గౌరవించారు.

ఈ కార్యక్రమం ప్రజల హృదయాలను తాకింది మరియు జిల్లా ప్రజలచే విశేషంగా అభినందించబడింది.

0
1630 views