logo

"ఆహా! ప్రోగ్రామ్ అంటే ఇలా ఉండాలి" అని ప్రశంసింపబడిన "స్వర బృందావనం" 19 వ సినీ సంగీత విభావరి. "పర్యావరణ పరిరక్షణ" స్పెషల్ ఎపిసోడ్.

మన చుట్టూ ఉన్న సహజ వనరులను పర్యావరణం అంటారు. ఈ వనరులు క్షీణిస్తే జీవరాశుల మనుగడ కే ముప్పు వస్తుంది. అందుకే మనం వాటిని కాపాడుకోవాలి. గాలి, నీరు, నేల, మొక్కలు, మొదలైన వాటిని కాపాడుకోవడం పర్యావరణ సమతుల్యత కు అవసరం.
కాలుష్యాన్ని తగ్గించడం, వనరులను సమర్ధంగా ఉపయోగించడం, చెట్లను నాటడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, రసాయన ఎరువులు పురుగు మందులు తగ్గించడం, మొదలైనవిచేస్తే సమతుల్యత ను కాపాడుకోవచ్చు. ఇది మన అందరి బాధ్యత. అందరం ప్రయత్నిస్తే భవిష్యత్ తరాలను కాపాడుకోవచ్చు.
"పర్యావరణ పరిరక్షణ" విలువ బాగా ఆకళింపు చేసుకున్న శ్రీమతి గొర్తి శారద, శ్రీ యామిజాల రామ్మోహన్ దంపతుల సమర్పణలో "స్వర బృందావనం" నిర్వాహకులు, యాంకర్ అయిన శ్రీ రవికాంత్ మరియు సహ నిర్వాహకులు శ్రీ కుమార్ ల సారథ్యంలో 09.06.2025 న శ్రీ త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్ నందు "స్వర బృందావనం" 19 వ సినీ సంగీత విభావరి అత్యంత వైభవోపేతంగా నిర్వహింపబడినది. శ్రీమతి శారద వినాయక ప్రార్ధన తో, "వృక్షో రక్షతి రక్షితః" అనే పర్యావరణ నినాదంతో కార్యక్రమం ప్రారంభించబడింది. గాయనీ గాయకులు అందరు పర్యావరణ పరిరక్షణ ను సూచించే ప్రకృతి వర్ణన పాటలతో ఆద్యంతం అలరించారు. కొంతమంది లలిత గీతాలు ఆలపించారు. తొలి సంధ్య వేళలో, ముత్యమంత పసుపు, ఆకులో ఆకునై, తెల్లవారక ముందే, తరలిరాద తనే వసంతం, తొలి సంధ్య కు తూరుపు ఎరుపు, కొమ్మ కొమ్మ కూ సన్నాయి, నిరంతరము వసంతములే, మొదలైన పాటలు పర్యావరణ పరిరక్షణ కు మచ్చుతునకలు. వ్యవస్థాపకులు, యాంకర్ అయిన రవికాంత్ "ప్రణామం ప్రణామం" అంటూ ప్రకృతి కి ప్రణామం చేశారు. శారద "పగలే వెన్నెల" కురిపించారు. చివరగా రవికాంత్ "ప్రాణ వాయువును సృష్టించే ఓ సృష్టికర్తయే తరువు" అంటూ ఒక పాటను రచించి తానే గానం చేశారు. శారద గారి మనుమడు చి. సాత్విక్ కూడా పర్యావరణ పరిరక్షణ అవగాహన ను పెంచుతూ ఓ మంచి స్క్రిప్ట్ తయారుచేసుకొని చదివి వినిపించాడు.
"ఆహా! ప్రోగ్రామ్ అంటే ఇలా ఉండాలి" "ప్రోగ్రామ్ కి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒకటే మాట చెపుతారు... ఏమిటంటే తనివితీరా ఎక్కువ పాటలు ఇస్తారు, కడుపునిండా మంచి విందు ఇస్తారు" "Great anchoring and beautiful singing by Mr. Ravikanth" "రవి శ్రీ ల గానం ఆతిథ్యం ఎవరూ చేయలేరు" "స్వర బృందావనం త్వరలో 1000 వ ఎపిసోడ్ చేయాలి" అని ప్రత్యక్ష పరోక్ష వీక్షకులందరు బహుధా ప్రశంసించారు.
ఈ అద్భుతమైన ప్రోగ్రామ్ 09.06.2025 ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంట కు ముగిసింది. ఇందులో శ్రీయుతులు రవికాంత్, శ్రీ కుమార్, చలం, సుబ్బరామన్ ప్రభృతులు, శ్రీమతులు శారద, సుగుణాశాస్త్రి, M.S. లక్ష్మి, సమీర, రమాదేవి ప్రభృతులు పాల్గొన్నారు.

115
8220 views