logo

కొమ్మినేని అరెస్టు అప్రజాస్వామికం.. – ఏపీ ప్రభుత్వ తీరుపై నాగర్‌కర్నూల్‌లో జర్నలిస్టుల నిరసన


నాగర్‌కర్నూల్‌:
సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా కేసు పెట్టి జైలుకు తరలించడం అప్రజాస్వామికమైన చర్యగా సీనియర్‌ జర్నలిస్టులు కందికొండ మోహన్, పాదం వెంకటేశ్‌ అన్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్‌ జిల్లాకేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో నల్లబ్యాడ్జీలు, ఫ్లకార్డులతో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమని చెప్పారు. జర్నలిజంలో 50 ఏళ్ల అపార అనుభవం ఉన్న కొమ్మినేనిని అన్యాయంగా అరెస్ట్‌ చేసి జైలులో పెట్టారని మండిపడ్డారు. టీవీ డిబేట్‌లో మాట్లాడే విశ్లేషకుల వ్యాఖ్యలను జర్నలిస్టులకు, మీడియా సంస్థలకు ఆపాదించడం ఏంటని ప్రశ్నించారు. పాత్రికేసులపై ఏదైనా చర్యలు తీసుకునేందుకు చట్టబద్ధ సంస్థలు ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ఇండియా ఉంటుందని, అక్రమ కేసులతో జైలులో పెట్టడం దుర్మార్గమని ఆక్షేపించారు. రాజకీయ కక్షలో భాగంగానే జర్నలిస్టులపై కేసులు, అరెస్ట్‌లకు పాల్పడుతూ పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టులు బాదం పరమేశ్, కాణాపురం ప్రదీప్, శ్రీనుబాబు, మల్లేశ్, రామ్‌లక్ష్మన్, వినయ్, శ్రీశైలం, సాదిక్‌ పాషా, పిన్నంశెట్టి సైదులు, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

2
3203 views