logo

జర్నలిస్ట్ల సమస్యలు వెంటనే పరిష్కారం చెయ్యండి..!! వినతి పత్రం కలెక్టర్ కు అందజేసిన గంట్ల, శ్రీనివాస్..!!

AIMA MEDIA :MAY 11:బుధవారం :విశాఖపట్నం..
న్యూస్ 9 :- విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జరలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ సమస్యలు పరిష్కారం కొరకు ఈ రోజు బుధవారం, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధర్నా నిర్వహించడం జరిగింది తర్వాత యూనియన్ సభ్యులు జిల్లా కలెక్టర్ కు తమ సమస్య ను వినతి పత్రం ద్వారా తెలిపారు. వివరాలు లోకి వెళ్తే వర్కింగ్ జర్నలిస్టులకు త్వరలో వైద్య పరీక్షలు
సమస్యలపై కూటమి ప్రభుత్వంకు నివేదన
సానుకూలంగా స్పందించిన కలెక్టర్
విశాఖపట్నం, జూన్ 11.
విశాఖపట్నం జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు త్వరలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ హామీ ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఎపిడబ్ల్యూజెఎఫ్) ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం విశాఖపట్నం జిల్లా ఫెడరేషన్ యూనిట్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ను కలిసి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను ప్రభుత్వం కు తెలియ చేయాలి అని కోరుతూ 12 అంశాలు పై వినతి పత్రం సమర్పించారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా వర్కింగ్ జర్నలిస్టులకు వైద్య పరీక్షలు చేయించాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన కలెక్టర్ ఈ నెల 21వ తేదీన జరగనున్న యోగాంధ్ర కార్యక్రమం పూర్తయిన వెంటనే దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటామన్నారు. చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇంటి స్థలాల సమస్యను పరిష్కరించాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని, త్వరలో ఏర్పాటు చేయనున్న అక్రెడిటేషన్ కమిటీలో ఎపిడబ్ల్యూజేఎఫ్, ఎపిబిజెఎ లకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పోతుమహంతి నారాయణ్ మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు వీలుగా రాష్ట్రంలో హోం మంత్రి ఆధ్వర్యంలో హై పవర్ కమిటీ, జిల్లాల్లో పోలీసు ఉన్నతాధి కారులతో కూడిన కమిటీలను తక్షణం ఏర్పాటు చేసి జర్నలిస్టులకు భద్రత కల్పించాలని కోరారు. మీడియా అకాడమీని బలోపేతం చేసి, ప్రతిభ కనబరిచిన జర్నలిస్టులకు అవార్డులు ఇవ్వాలన్నారు. జర్నలిస్టులకు కార్మిక భీమా, ఆరోగ్య బీమా సదుపాయం వర్తింపచేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. జర్నలిస్టులకు పింఛను సదుపాయం కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ విశాఖపట్నం జిల్లా కార్యదర్శి జి శ్రీనివాస్, ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఇరోతి ఈశ్వరరావు, చింతాడ మదన్ ఆంధ్రప్రదేశ్ స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు వి. ఎస్. జగన్ మోహన్ రావు ఇతర ప్రతినిధులు కె.వి శర్మ, పి రవిశంకర్, బి. అప్పల నాయుడు, కే సత్యనారాయణ,కె. తులసీదాస్, టి. కృష్ణమూర్తి, నగేష్, పి. శ్రీనివాసులు నాయుడు, డి. పి నాయుడు, జి. ఆర్. ఎస్. రమేష్,రమణమూర్తి, పి శ్రీలత, బి రేణుక, జి. సత్యనారాయణ, బి తేజ,శివ, రమేష్,వెంకటరమణ, ఫణి తదితరులు పాల్గొన్నారు.

15
5526 views