అహ్మదాబాద్ వద్ద విమాన ప్రమాదం...దిగ్బ్రాంతి గురైన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి.
అనంతపురం : ఉమ్మడి జిల్లాలోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి అహ్మదాబాద్ వద్ద జరిగిన విమాన ప్రమాదాన్ని గురించి తెలిసి దిగ్భ్రాంతి గురయ్యారు . ఈ సంఘటనలో మృతి చెందిన వారికి ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సంఘటన తనని అమితంగా బాధించిందని ప్రస్తుతం ఎలాంటి విషయాలు చర్చించదలుచుకోలేదన్నారు. లండన్ వెళ్తున్న ఈ విమానంలో 242 మంది ఈ సంఘటనలో చనిపోయారు.