logo

విమ్స్ డైరెక్టర్. డా "రాంబాబు.. ఆధ్వర్యంలో విమ్స్ ఆసుపత్రి లో మెగా రక్తదానా శిభిరం..!!

AIMA న్యూస్ 9:- విశాఖపట్నం జిల్లా విమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిభిరం.. డా ""రాంబాబు సమక్షంలో ఆసుపత్రి సిబ్బంది, మరియు ప్రెవేట్ వర్క్స్ ద్వారా మెగా రక్తదానా శిభిరం ఏర్పాటు చేసాం అని విమ్స్ డైరెక్టర్.. డా "" రాంబాబు తెలిపారు.. వివరాలు లోకి వెళ్తే రక్తదానంతో ఆరోగ్యం.. ఆనందం
-విమ్స్ లో ప్రపంచ రక్త దాన దినోత్సవం


విశాఖ:
ప్రతి ఆరు నెలలకు ఒకసారి రక్తదానం చేయటం వలన ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నాం అనే మనసు సంతృప్తితో పాటు ఆరోగ్యవంతులుగా ఉండవచ్చు అని విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ కే రాంబాబు అన్నారు. ప్రపంచ రక్త దాన దినోత్సవ సందర్భంగా శుక్రవారం విమ్స్ ఆసుపత్రిలో పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా ఆస్పత్రి సిబ్బంది నిర్వహించిన అవగాహన ర్యాలీ ను ఆయన ప్రారంభించారు. రెండు కిలోమీటర్ల మేర జరిగిన ఈ ర్యాలీలో ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి సరైన సమయంలో రక్తం అందక చాలా ఇబ్బందులు పడుతున్నారని ఈ రక్తం కొరత లేకుండా ఉండాలంటే ప్రజలు ముఖ్యంగా యువత రక్త దానం చేయటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఒక్క యూనిట్ రక్తం ద్వారా ఆపదలో ఉన్న ముగ్గురిని రక్షించే అవకాశం ఉంటుందన్నారు. విమ్స్ ఆస్పత్రి నందు గత ఆరు నెలలుగా బ్లడ్ బ్యాంక్ సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఇప్పటివరకు ఎనిమిది రక్తదాన శిబిరాలను నిర్వహించగా 542 యూనిట్ల రక్తాన్ని సేకరించటం జరిగిందన్నారు. త్వరలో రక్తహీనతతో బాధపడుతున్న తలసేమియా రోగులు కోసం ప్రత్యేక వార్డును విమ్స్ ఆస్పత్రిలో ప్రారంభించునున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రక్తదానంపై అవగాహనతో కూడిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విమ్స్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

21
3740 views