
కొమ్మినేని విడుదలకు సుప్రీం ఆదేశం. సత్యమేవ జయతే అన్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి
సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ కేసు విచారణ జరిపిన జస్టిస్ పీకే మిశ్రా జస్టిస్ మనోహర్. వాక్ స్వాతంత్రాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని సుప్రీం తెలియజేసింది. అలాగైతే కేసు విచారణ సందర్భంగా తాము కూడా నవ్వుతుంటామని తెలిపారు. చర్చ కార్యక్రమాల్లో విశ్లేషకులు వాక్యాలు చేస్తే కొమ్మినేని ఎలా అరెస్టు చేస్తారు అని ప్రశ్నించింది. ఆర్టికల్ 32 కింద ప్రాథమిక హక్కుల్ని హరించారన్న వాదనలతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. 35(3) బి ఎన్ ఎన్ ఎస్ నోటీసు కింద ఎందుకు నోటీసు ఇవ్వలేదని ప్రశ్నించింది.
మూడేళ్లకు లోబడే శిక్ష ఆరోపణ కదా? ఎందుకు అరెస్టు చేశారు. 70 ఏళ్ల వృద్ధుడిని ఎలా అరెస్టు చేస్తారు. బావ ప్రకటన స్వేచ్ఛను పరిరక్షించాల్సిందే అన్నారు. కొమ్మినేని కి వెంటనే బెయిల్ పై విడుదల చేస్తూ ఈ కేసును 8 వారాలకు వాయిదా వేశారు.
70 ఏళ్ల వృద్ధుడు సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు నిజాయితీపరుడు అన్న విషయం తెలిసి కూడా కూటమి ప్రభుత్వం ఆయన విషయంలో కఠినంగా ప్రవర్తించిందని వైయస్సార్ సిపి పార్టీ ధర్మవరం మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తెలిపారు.ఏమైనా సత్యమే జయించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి ఈ కేసు చెంప పెట్టని అన్నారు. సుప్రీంకోర్టులో ఈ కేసును పొన్నవొలు సుధాకర్ రెడ్డి సహ న్యాయవాదులు వాదనలు వినిపించారు.