logo

ఆర్యవైశ్య జాతిరత్నం దొడ్డ మోహన్ రావు మృతి తీరని లోటు

తొర్రూరు జూన్ 15(AIMEDIA)
ఆర్యవైశ్య కులంలో పుట్టిన మహోన్నతమైన వ్యక్తి దొడ్డ. మోహన్ రావు ఆర్యవైశ్య జాతిరత్నం ఆయన మృతి సమాజానికి తీరని లోటు పలువురు తెలిపారు.దొడ్డ మోహన్ రావు హైద్రాబాద్ లో గుండె పోటు తో శనివారం రాత్రి అకాల మరణం చెందాడని బంధువులు తెలిపారు.
దాతృత్వం గల దాత ,ప్రముఖ పారిశ్రామికవేత్త నర్సంపేట ప్రాంత వాస్తవ్యులు దొడ్డ.మోహన్ రావు మరణం పట్ల చింతిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాము.దాన ధర్మాలు చేయడంలో గొప్ప మనసు గల వారు. ఒక్కరే ఎన్నో గుళ్ళు కట్టించి దైవభక్తిని చాటుకున్నారు. అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిన మహనీయుడు. తెరాస ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమానికి తన వంతు సహకారం అందించారు.నర్సంపేట ప్రభుత్వ హాస్పిటల్ కు మరియు మెడికల్ కాలేజీకి 20 ఎకరాలు బుదానం చేసి నర్సంపేటకు మెడికల్ కాలేజ్ వచ్చే విధంగా సహకరించారు.గొప్ప సహకారాం అందించిన మానవతవాదిని కోల్పోవడం దురదృష్టకరo.పుట్టిన ఊరును పెరిగిన ప్రాంతాన్ని మరవక నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలని దృఢ సంకల్పంతో కష్టపడి డబ్బు సంపాదించడమే కాదు దానికి స్వార్ధకత ఉండాలని ఎంతోమంది ఆర్థికంగా ఉన్నవారికి ఆదర్శంగా నిలిచారు.వారి గత స్మృతులు గుర్తు తెచ్చుకుంటూ నర్సంపేట ప్రాంతంలో లింగగిరి చెందిన మోహన్ రావు. కుల మతాల కతీతంగా అభిమానులు నివాళులు అర్పించడం జరిగింది.మన ఆర్యవైశ్య జాతికే పేరు తెచ్చి పెట్టిన దొడ్డ మోహన్ రావు కు పలువురు నేతలు, వారి కుటుంబ సభ్యులు గ్రామస్తులు బందువులు కన్నీటి వీడ్కోలు పలికారు

16
35 views