logo

విద్యుత్ షాక్ తో రైతు మృతి.

అనంతపురం : ఉమ్మడి అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం చెన్నేకోట గ్రామ సమీపంలోని పొలం లో విద్యుత్ షాక్ గురై ఎర్రప్ప అనే రైతు మృతి చెందారు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ఎర్రప్ప (60) చేన్నేకోట గ్రామం పొలంలో ఆవులు మేపుతుండగా ఒక ఆవు పొలంలోని విద్యుత్ స్తంభానికి దగ్గర్లో తెగిపడి ఉన్న విద్యుత్ వైర్ కి తగిలి కరెంట్ షాక్ గురై విలవిల ఆడుతుండగా దాన్ని తప్పించబోయి రైతు ఎర్రప్ప విద్యుత్ షాక్ గురై మృతి చెందారు ఈ సంఘటన గ్రామస్తులందరినీ కంటతడి పెట్టించింది ఆయనకు భార్య లక్ష్మీదేవి ఒక కుమారుడు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ప్రభుత్వం ఎర్రప్ప కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.

10
753 views