
జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం.... వైయస్సార్సీపి
అనంతపురం : ఉమ్మడి జిల్లా ధర్మవరం పట్టణంలోని మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారి కార్యాలయంలో వైయస్సార్సీపి జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాస్ రెడ్డి గారు జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధర్మవరం పట్టణానికి చెందిన ఇరువురు అధ్యక్షులు నీలూరు ప్రకాష్. బాలిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్టు సూపర్ సిక్స్ పేరిట ప్రచారం ఉదర గొట్టారు. ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఎన్నికల్లో గెలిచి కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినప్పటికీ సంక్షేమ పథకాలను పూర్తిగా అమలు జరపకుండా రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వారు పేర్కొన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని ప్రగల్బాలు పలికి లక్ష 60 వేల మంది కి పైగా వాలంటీర్లను. ప్రజా పంపిణీ వ్యవస్థలో సహకరిస్తున్న 20వేల మంది చిరు ఉద్యోగుల్ని వీధుల పాలు చేశారన్నారు. వారికి జాబు లేకుండా నిరుద్యోగులుగా మార్చారని ఎద్దేవ చేశారు. నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి చిన్న మధ్యతరగతి కుటుంబాలు గగ్గోలు పెడుతున్న కూటమి ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తుందని వాపోయారు. అలాగే రాష్ట్రంలో మహిళల పట్ల దాడులు అత్యాచారాలు పెరిగాయన్నారు. కామాంధులు చిన్నారుల జీవితాల్లో చిదిమేస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంలో విఫలమైందని తెలిపారు. చంద్రబాబు నాయుడు సొంత మామనే కాక నేడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు చాంద్ బాషా. మున్సిపల్ వైస్ చైర్మన్లు పెనుజూరు నాగరాజు. మసాపల్లి సాయికుమార్. చందమూరు నారాయణరెడ్డి. ధర్మవరం రూరల్ నాయకులు చిగిచెర్ల ప్రభాకర్ రెడ్డి.ధర్మవరం పట్టణ ముస్లిం మైనార్టీ నియోజకవర్గం ఇన్ చార్జ్ పిఎం సాధిక్ భాష. పట్టణ నాయకులు సయ్యద్ హిదాయ తుల్లా(ఇద్దు). కార్పెంటర్ షబ్బీర్. ఫయాజ్ భాష. వైయస్సార్ సిపి నాయకులు జిలాన్ భాష. పెద్దన్న. ఎస్సీ ఎస్టీ సెల్ నాయకులు రమేష్. చౌడప్ప. బీసీ నాయకులు నరేష్. నరసింహులు. విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు అమర్నాథ్ రెడ్డి. పురుషోత్తం. మీడియా సెల్ అంజి. ఆఫీస్ కార్యదర్శి నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.