logo

పాత కొత్త మేలికలయిక అపురూపమైన పాట లతో అలరించిన "స్వర బృందావనం" 20 వ సినీ సంగీత విభావరి.

"మంచి బ్యానర్" అని పేరు పొందిన "స్వర బృందావనం" 20 వ సినీ సంగీత విభావరి 16.06.2025 న శ్రీ బృందావనం రవికాంత్, శ్రీ తూములూరి శ్రీకుమార్ ల సారథ్యంలో సిటీ కల్చరల్ సెంటర్, హైదరాబాదు లో సమర్ధవంతంగా నిర్వహింపబడింది.
ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకులందరు "స్వర బృందావనం" ప్రత్యేకతను గుర్తించారు. ఈ విషయం వారి వారి అమూల్యమైన అభిప్రాయాలను సందేశాల రూపంలో వ్యక్తం చేయడం వలన, ఇప్పటికి 500 views రావడం వలన నిర్ధారణ అయినది.
ఈ కార్యక్రమం యధాప్రకారం శ్రీ రాంబాబు వినాయక ప్రార్థన తో ప్రారంభింపబడినది. తరువాత శ్రీమతి సీతాకుమారి "జననీ శివకామినీ" అంటూ సర్వమంగళాదేవి ని స్తుతించారు. అటుపిమ్మట పాత కొత్త పాట ల మేలికలయిక తో ఆద్యంతం కార్యక్రమం అద్భుతంగా కొనసాగింది. ప్రతి ఒక్కరు ఇదివరలో తాము పాడిన పాటలు కాక వేరే కొత్త పాటలు పాడి మెప్పించారు. తెలుగు హిందీ పాటలతో హోరెత్తించారు. "విశాల గగనంలో చందమామ, మౌనమేలనోయి, బాజీగర్, హృదయం ఎక్కడున్నాది, నిరంతరము వసంతములే, అందరికీ అభయంబులిచ్చు చేయి" మొదలైన evergreen పాట లతో గాయనీ గాయకులందరు ప్రేక్షక మహాశయులను ఉర్రూతలూగించారు.
"ప్రోగ్రాం చేయాలన్నా, యాంకరింగ్ చేయాలన్నా, అద్భుతంగా పాడాలన్నా రవికాంత్ గారు బెస్ట్" "మనస్సుకు ఆహ్లాదం కలిగించే ఇలాంటి కార్యక్రమాలు రవికాంత్ గారు మరెన్నో చేయాలి" "The best Banner for ever" అంటూ ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకులందదరు కార్యక్రమాన్ని, రవికాంత్ అతిథి సత్కారాన్ని బహుధా ప్రశంసించారు. ఇంకా కొన్ని స్థలాభావం చేత వ్రాయబడలేదు.
ఈ కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై, రాత్రి 9 గంటలకు జనగణమన తో అద్వితీయంగా ముగిసింది. ఇందులో శ్రీయుతులు రవికాంత్, శ్రీకుమార్, రాంబాబు, చలం, విజయరాఘవన్, వెంకట ప్రసాద్, రాజకుమార్, వేదవ్యాస్ ప్రభృతులు, శ్రీమతులు శారద, సీతాకుమారి, MS లక్ష్మి, రమాదేవి ప్రభృతులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

91
1944 views