
మామిడి రైతుల కన్నీళ్లు కూటమి ప్రభుత్వానికి కనబడలేదా. ?
మామిడి రైతుల కన్నీళ్లు కూటమి ప్రభుత్వానికి కనబడలేదా. ?
గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్లపైనే అగచాట్లు పడుతుంటే ప్రభుత్వ చర్యలు ఎక్కడ???
వ్యవసాయ మంత్రి జిల్లా పర్యటనకు వచ్చి ఎనిమిది రూపాయలు కొనుగోలు చేయాలన్న ఎక్కడ అమలు కానీ వైనం
రైతులకు గిట్టుబాటు ధర కల్పించి మేలు చేయకపోతే ఉద్యమాలు చేపడతాం అనీ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఇన్చార్జి M C విజయానంద రెడ్డి తెలిపారు.
చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ నాయుడు గారి ప్రోత్బలంతో వారి అనుచరులు ఎమ్మార్వో గారితో కుమ్మక్కై వందల పర్మిట్లు తీసుకోవడం జరుగుతుంది. గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో మామిడి రైతులకు కేజీ 25 రూపాయలు వరకు ఇచ్చినటువంటి సందర్భం ఉంది. ప్రభుత్వం వెంటనే రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని పరిష్కరించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాము.
గుడిపాల మండలం :
మామిడి రైతుల ఆవేదన, బాధలు రోజురోజుకు తీవ్రతరమైపోతున్నాయి, మామిడి రైతుల కన్నీళ్లు కూటమి ప్రభుత్వం అసలు పట్టించుకోలేదని చిత్తూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి M C విజయానంద రెడ్డి మండిపడ్డారు. చిత్తూరు నియోజకవర్గంలో రైతులు కష్టాలు పడుతున్నారని, సంవత్సరం కాలం పాటు కష్టం శ్రమించి అప్పుచేసి పెట్టుబడి పెట్టి మామిడి పంట చేతికి వచ్చే సమయానికి గిట్టుబాటు ధర లేక కొనుగోలు చేసేవారు లేక అన్నదాత కన్నీరు పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిట్ ప్లస్ ఫోర్ పేరుకే చెప్పిన ఎక్కడ అమలు కాలేదని మండిపడ్డారు. చిత్తూరు నియోజకవర్గ గుడిపాల మండల కేంద్రంలో TASA, RMM మరియు FOOD & INN పరిశ్రమ వద్ద దాదాపు మూడు కిలోమీటర్ల మేర రైతులు మామిడికాయలతో ట్రాక్టర్లలో నాలుగు రోజులుగా వేచి చూస్తున్నా ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రభుత్వాలు కనీస స్పందన లేదు. తిండి నీరు లేక రోడ్లపై ఇబ్బందులు పడుతున్న రైతు తీవ్రఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి పూర్తి మామిడి పంటను కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.