logo

సమాజ సేవకుడిని ఘనంగా సన్మానించిన 11 కేవీ విద్యుత్ తీగల బాధితులు:-

సమాజ సేవకుడిని ఘనంగా సన్మానించిన 11 కేవీ విద్యుత్ తీగల బాధితులు:-

సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం ""హైదరాబాద్ రీగల్ హోటల్ నందు నిర్వహించగా"""కుబీర్ గ్రామంలోని న్యూ అబాది కాలనీ వాసులు గత 20 సంవత్సరాలుగా తీవ్ర అవస్థలకు గురవుతున్నారని, వర్ష కాలం వస్తే అద్దె ఇండ్లలో ఉండవలసి వస్తుందని, గత 8 సంవత్సరాల కిందట 8 ఇండ్లు పూర్తిగా దగ్ధం అయ్యాయని కేసు నమోదైనప్పటికీ, ఇప్పటివరకు పాలకులు, అధికారులు ఎందరో మారుతున్నప్పటికీ""""మా తలరాతలు మాత్రం మారడం లేదని""" జూన్ 23-2024 వరంగల్లోని TSNPDS సిఎండి కర్నాటి వరుణ్ రెడ్డికి సైతం వినతి పత్రం అందించామని, అంతే కాకుండా మాతో 4 లక్షల రూపాయల పై చిలుకు విద్యుత్ అధికారులు డిడి కూడా కట్టించుకొని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ, విద్యుత్ తీగలను మాత్రం తొలగిస్తే లేరని వాపోయారు. ఇట్టి విషయాన్ని గ్రామానికి చెందిన సామాజిక సేవకుడు డాక్టర్ సాప పండరి సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లి, ముధోల్ నియోజకవర్గ శాసనసభ్యులు రామారావు పటేల్ తొలగింపుకై కృషి చేస్తున్నారనే విషయాన్ని, ఆర్గనైజేషన్ ప్రతినిధుల సహకారం కావాలని కోరగా-సానుకూలంగా స్పందించిన నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ తప్పకుండ కృషి చేద్దామని హామీ ఇవ్వడం హర్షించదగ్గ విషయమని, ఈ రోజు """సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రెడ్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ ధన్యవాదములు తెలియజేస్తూ, """తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం RTI సెల్ చైర్మన్""""డాక్టర్ సాప పండరిని తీపి తినిపించి,పూలమాలలతో,
శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా న్యూ అబాది కాలనీ అధ్యక్షులు షేక్ హైదర్, సాప పోతన్న, బిట్లిన్ హనుమాన్లు,మేర రమేష్ యుసుఫ్,వహీద్ ఖాన్, ఫారుక్, మధ్వ పాషా,అయూబ్ ఖురేషి,కయ్యూమ్, మోసిన్, రఫిక్, వసీం పాల్గొన్నారు

7
1153 views