logo

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్- 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవము

తేదీ: 21-06-2025: చందానగర్, శే ర్లింగంపల్లి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవము పురస్కరించుకొని ,ఈరోజు ఉదయం యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ న్యూబ్లూమ్ హైస్కూల్, సఫారీనగర్, కొత్తగూడనందు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యోగా గురువు V. రామారావు పిల్లలచేత యోగాసనాలు వేయించడం జరిగింది. ముఖ్యంగా జ్ఞాపకశక్తి, ఏకాగ్రతలకు సంబంధించిన ఆసనాలు వేయించడం జరిగింది. ఈ సందర్భంగా కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మరియు యోగా గురువు రామారావులు మాట్లాడుతూ *"యోగా అనేది ఆరోగ్య కరమైన జీవనశైలి. అందరు ఆ ఆరోగ్యకరమైన జీవనశైలికోసం యోగాను జీవితంలో ఒక భాగము చేసుకోవడానికై ఐక్యరాజ్యసమితి (UNO) వారు ప్రతి సంవత్సరం జూన్ 21, 2015 నుండి ఒక నినాదంతో పాటిస్తున్నారు. ఈ సంవత్సరపు నినాదం " _ఒక భూమి, ఒక ఆరోగ్యానికి యోగం"._ యోగ సాధన వలన కలిగే అనేక ప్రయోజనాల గురించి ప్రపంచ వ్యాప్తంగా అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం"* అని అన్నారు. *"యోగా కేవలం ఫిట్ నెస్ కొరకు మాత్రమే కాదు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మరియు సమతుల్యతను పెంచుతుంది. యోగాలో ప్రధానంగా మూడు ప్రక్రియలు ఉంటాయి. 1. యోగాసనాలు, 2.ప్రాణాయామం, 3.మెడిటేషన్.*
*యోగా శరీరంలోని కండరాలను బలోపేతం చేస్తుంది. రక్తప్రసరణ మెరుగు పరుస్తుంది. శరీరంలోని కొన్ని నొప్పులను తగ్గిస్తుంది. శక్తిని పెంచుతుంది. అలసటను తగ్గిస్తుంది. జీవక్రియను మెరుగు పరుస్తుంది. క్యాలరీలను బర్న్ చేసి బరువు తగ్గిస్తుంది. అవసరమైన సందర్భాలలో బరువు పెరగడానికి కూడా ఉపకరిస్తుంది. మనసుకు సంబంధించిన ' సైకో సోమాటిక్ డిసీజెస్' వంటి వాటిని యోగా ద్వారా నయం చేసుకోవచ్చు. యోగా అనేది ఒక జీవన విధానం. మన శరీరమే ఒక పెద్ద రసాయన పరిశ్రమ. దానికి కావలసిన ముడి సరుకు అందిస్తే, అది మనకు కావలసిన శక్తిని తయారుచేసి మనకు అందిస్తుంది. మనకు నిజమైన తోడు మన శరీరమే. శరీరాన్ని శ్రద్ధగా చూసుకోవాలి. మనం చేయవలసిందల్లా శరీరానికి సహకరించడమే. ఆసనాలు వేయడం. సక్రమమైన పద్ధతులలో గాలి పీల్చడం. తగినంతగా నీరు త్రాగడం. సరియైన పౌష్టికాహారంతో పాటు పీచు పదార్థములను అధికంగా తీసుకోవడం. అన్ని కీళ్ళను కదిలిస్తూ ఉండడం. మనసును స్థిరంగా ఉంచుకోవడం. తగిన విశ్రాంతి నివ్వడం. ధూమ, మద్యపానం, మాదకద్రవ్యాల నినియోగాలకు దూరంగా ఉండటంతో పాటు మన చుట్టు ఉన్న పరిసరాలను, సమాజాన్ని అర్థం చేసుకోవడం అనే సామాజిక బాధ్యతను పాటించడం. యాంత్రిక జీవితం గడుపుతున్న నేటి మానవుడు సంపూర్ణ ఆరోగ్యవంతునిగా ఉండేందుకు కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాలవారు స్త్రీ, పురుష భేదం లేకుండా యోగసాధన చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి" అని కోరారు. " యోగశాస్త్రసూత్రాలను మానవాళికి అందించిన గొప్ప యోగి పతంజలి మహర్షి"* అని తెలిపారు. " *వ్యాధి లేని శరీరం - వేదన లేని మనస్సు యోగా తోటే సాధ్యము"* అని అన్నారు."ఈ భూమ్మీద పగటి సమయం ఎక్కువగా ఉండే రోజు యిది..అందుకే యోగా దినోత్సవంగా జూన్ 21వ తేదీని ఎన్నుకోవడం జరిగింది. విశ్వశక్తి తరంగాలు ఎక్కువగా వ్యాపించడం ముఖ్య కారణం..ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ కిరణ్, అధ్యాపకులు, విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

50
5346 views