
ఉచిత దంత వైద్య శిబిరం
తేదీ:22-06-2025. శేర్లింగంపల్లి, చందానగర్:ఈరోజు ఉదయం అఫీస్ పేట డివిజన్ లో గల, ఇంజనీర్స్ ఎన్క్లేవ్ కమ్యూనిటీ హాల్ వన్ నందు, షేరేణి స్మైల్స్ దంత వైద్యశాల (కొండాపూర్) వారు ఈరోజు ఉదయం 10:00 నుండి ఒంటిగంట వరకు ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వినీత్ రెడ్డి దంత పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గారు మాట్లాడుతూ,ఉదయము సాయంత్రము ప్రతిరోజు దంత పరిశుభ్రత పాటించాలని అన్నారు. మనం ఏదైనా ఆహారం తీసుకున్న వెంటనే మనం ఏదైనా ఆహారం నీటితో నోటిని పుక్కిలించాలని తెలిపారు. దంత సమస్యలు ఉన్నచో అశ్రద్ధ చేయకుండా వెంటనే దంత వైద్యులను సంప్రదించి వారి సూచనలు సలహాలు పాటించాలని,అని అన్నారు. అశ్రద్ధ చేసినచో మనం తీసుకునే ఆహారం పూర్తిగా నమల లేకుండా పోవడం వలన అజీర్తితో అనేక రకాల ఉదరకోశ రోగాలు సంభవిస్తాయని, గుండె జబ్బులు లివర్ కిడ్నీ వ్యాధులు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయని, శాస్త్రవేత్తలు తమ నివేదికల ద్వారా తెలియజేస్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ దంతాలను సంరక్షించుకొని, ఆరోగ్యవంతులుగా ఉండాలని తెలిపారు. ఈ శిబిరాన్ని ఇంజనీర్ ఎన్క్లేవ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆంజనేయరాజు గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాలనీ నాయకులు శంకర్ రెడ్డి, శివప్రసాద్, కోటేశ్వరరావు, లక్ష్మణరావు, వెంకటేశ్వరరావు, చంద్రశేఖర్,బుచ్చయ్య, వెంకట్రావు, సురేష్, శ్రీనివాస బాబు, సీతారాం ప్రసాద్, శివరామకృష్ణ,మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిపోయిన రామస్వామి యాదవ్, కౌండిన్యశ్రీ నండూరి వెంకటేశ్వరరాజు, నరాల మహేశ్వర్ రెడ్డి, మొదలైనవారు పాల్గొన్నారు. ఈ శిబిరంలో 100 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.