జాతీయ రహదారిపై ఓ వ్యక్తి మృతి...!!
పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక, కామారెడ్డి జిల్లా : బిచ్కుంద లోని కందర్పల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. 108 అంబులెన్స్ సిబ్బంది, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జుక్కల్ మండలంలోని పడంపల్లి గ్రామానికి చెందిన బాల్ రాజ్(30) మండలంలోని కందర్ పల్లి గ్రామ సమీపంలో 161వ నంబర్ జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో వస్తూ తుఫాన్ వాహనాన్ని ఢీకొనడంతో తలకు, ఎడమకాలికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో మెరుగైన చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా దవాఖానకు తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై మోహన్రెడ్డి తెలిపారు.