logo

డిఎన్టీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్టేషనరీ బుక్స్ పంపిణీ చేసిన మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్

తొర్రూరు జూన్ 23(AIMEMEDIA)
మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని హచ్చు తండ డిఎన్టీ ప్రాథమిక పాఠశాల లో సోమవారం విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్స్, బిస్కెట్స్ పంపిణీ చేయడం జరిగిందని మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఫౌండర్ సిరికొండ విక్రమ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వాసవి క్లబ్ ప్రధాన కార్యదర్శి ఇమ్మడి రాంబాబు మాట్లాడుతూ సంస్థ ఏర్పడిన నాటి నుండి నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల ఆదరాభిమానాలను చూర గొంటూ బెస్ట్ వాలంటరీ ఆర్గనైజేషన్ గా అధికార అనధికార ప్రతినిధుల చేత ప్రశంసలందుకుంటున్న సంస్థగా కీర్తింపబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాసోజు రాజేష్, బిజ్జాల ప్రసాద్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జీ పల్లవి, ఉపాద్యాయులు యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

0
249 views