రైలులో భారీ దోపిడీ.. పక్కా ప్లాన్ గా...
రైలులో భారీ దోపిడీ.. పక్కా ప్లాన్ గా...
ముంబయి నుంచి చెన్నైకి వెళ్లే చెంగల్పట్టు ఎక్స్ప్రెస్లో భారీ దోపిడీ జరిగింది. అనంతపురం జిల్లా కోమలి రైల్వే స్టేషన్ సమీపంలో సిగ్నల్ కేబుల్ కత్తిరించిన దుండగులు బోగీలోకి చొరబడ్డారు. ప్రయాణికులను బెదిరించి డబ్బులు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ఘటనపై బాధితులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.