logo

ప్రభుత్వ పాఠశాలలో యాంటీ డ్రగ్స్ డే సందర్బంగా చిత్రలేఖన పోటీలు.

కొడిమ్యాల మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం జూన్ 26,2025 సందర్భంగా పాఠశాల స్థాయిలో చిత్రలేఖన పోటీలు బాలబాలికలకు నిర్వహించారు. ఈ పోటీలలో మాదకద్రవ్యాల వినియోగం వద్దంటూ నినాదాలతో కూడిన పోస్టర్లను రూపొందించారు. 30 మంది విద్యార్థులు పాల్గొన్న చిత్రలేఖన పోటీలలో టీ. రేఖ ప్రథమ, ఎం. పల్లవి ద్వితీయ బహుమతి సాధించారు. ఈ సందర్బంగా కొడిమ్యాల సబ్ ఇన్స్పెక్టర్ సందీప్ హాజరై చిత్రలేఖన పోటీలలో ప్రతిభ కనబరచిన విద్యార్థినులు రేఖ, పల్లవి లను అభినందించారు. విద్యార్థినులు గీసిన చిత్రాలను జిల్లా పోలీసుశాఖకు పరిశీలనకు పంపిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ సందీప్ మాట్లాడుతూ విద్యార్థులందరూ విద్యార్థి దశలోనే మంచి ఆరోగ్యపు అలవాటులను అలవర్చుకోవాలని ఇందుకు ఉపాధ్యాయులు భోదించే మంచి విషయాలను గ్రహించాలని సూచించారు. 26 జూన్ గురువారం రోజున కొడిమ్యాల మండల కేంద్రంలో నిర్వహించే అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీని ప్రభుత్వ కళాశాల,పాఠశాలల విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఏ. విజయేంద్ర, కొడిమ్యాల ఎస్ఐ సందీప్ కుమార్, పిడి బూట్ల రాజమల్లయ్య, ఉపాధ్యాయులు హమీదుల్లా ఖాన్,తిరుపతిరెడ్డి,అంజయ్య, క్రాంతి కుమార్, గైడ్ టీచర్ రాజకుమార్, కానిస్టేబుల్ లు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

52
2879 views