logo

తెలంగాణలో కొత్త నేషనల్ హైవే.....

తెలంగాణలో కొత్త నేషనల్ హైవే అందుబాటులోకి రానుంది. ఖమ్మం నుంచి దేవరపల్లి (తూర్పుగోదావరి) వరకు నిర్మిస్తున్న ఈ 162 కి.మీ.ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే పనులు చివరి దశలో ఉన్నాయి. ఆగస్టు 2025 నాటికి ఇది పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నాలుగు వరుసల రహదారి హైదరాబాద్-విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయాన్ని, దూరాన్ని (56 కి.మీ.) గణనీయంగా తగ్గిస్తుంది...

నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో రోడ్ల నిర్మాణం వేగవంతమైందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గత పదేళ్లుగా జాతీయ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, తెలంగాణలోని 33 జిల్లాల్లో 32 జిల్లాల గుండా జాతీయ రహదారులు వెళ్తున్నాయని ఆయన వెల్లడించారు. రోడ్ల అభివృద్ధి పెట్టుబడులను ఆకర్షిస్తుందని, రహదారుల అనుసంధానం అత్యంత ముఖ్యమని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు......

0
0 views