logo

కొడిమ్యాల లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను, మోడల్ స్కూల్ ను పరిశీలించిన జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

కొడిమ్యాల మండలంలో బుధవారం రోజున ఎంపిడిఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సందర్శించితదుపరి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన నిరుపేదల సొంత ఇంటి కల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు నిర్మిస్తున్న ఇళ్ల కొలతలు, వాటి నాణ్యతలు పనులు మొదలుపెట్టి ఎన్ని రోజులు అవుతుంది అని తెలుసుకొని నిర్మాణ పనులు ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారంగానే కట్టుతున్నారా లేదా అని తెలుసుకుని లబ్ధిదారులందరూ నిర్మాణ పనులు తొందరగా చేపట్టి ముగించుకొని ప్రభుత్వం నుండి వచ్చే డబ్బులు తీసుకోవాలని సూచించారు. అనంతరం మోడల్ స్కూల్ ను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో పులి మధుసూదన్ గౌడ్, ఎంపీడీవో స్వరూప, ఎమ్మార్వో కిరణ్ కుమార్, ఆర్ ఐ తదితరులు పాల్గొన్నారు.

47
1822 views