డా. జితేందర్ ని సన్మానించిన మార్కెట్ కమిటి చైర్మన్ కొత్తూరి మహేష్, అంబెడ్కర్ యువజన సంఘ సభ్యులు.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల కేంద్రానికి చెందిన డా. జితేందర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 10 సంవత్సరాలనుండి దాదాపు 6000 కు పైగా సర్జరీలు విజయవంతంగా పూర్తి చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడినందుకు గవర్నమెంట్ ఆసుపత్రి తరుపున అత్యున్నత ఘనత కనబరచిన సర్జన్ డా,,పి. జితేంధర్ ఎంబిబిస్. ఎం ఎస్ జనరల్ సర్జన్ ను గుర్తించి సుమన్ టివి తెలంగాణ ఆధ్వర్యంలో ఉత్తమ డాక్టర్అ వార్డును ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చేతుల మీదుగా అందుకున్నందుకు డా,,పి. జితేంధర్ ను చొప్పదండి ఎ ఎం సి చైర్మన్ కొత్తూరి మహేష్ ఆధ్వర్యంలో శాలువా కప్పి పూలబొకే అందించి అంబేద్కర్ చిత్ర పటాన్ని అందించి సన్మానం చేసారు. ఈ కార్యక్రమం లో కట్ల చిరంజీవి, కొత్తూరి దేవయ్య, శంకర్, మోహన్,సురేష్, అజయ్, అనిల్, విద్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.