మహిళా సాధికారతతోనే సుపరిపాలన సాధ్యం : ఎమ్మెల్యే రేగం
ప్రారంభమైన మహిళా సర్పంచుల మూడు రోజుల శిక్షణ
మహిళా సాధికారత తోనే సుపరిపాలన సాధ్యమౌతుందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. అరకులోయ, డుంబ్రిగుడ, అనంతగిరి మండలాల మహిళా సర్పంచ్ లకు గురువారం నుండి శనివారం వరకు అరకులోయ లో నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మహిళా సర్పంచు లు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీటీసీ శెట్టి రోషిణి అన్నారు. మార్పు ద్వారా విజేతలు-సాధికారతతో స్వపరిపాలన సాధ్యం అనే అంశం పై ఈ శిక్షణ ఉంటుందని అరకులోయ ఎంపీడీఓ లవరాజు తెలిపారు. 73వ రాజ్యాంగ సవరణ మహిళా సర్పంచ్ లకు కల్పించిన అవకాశాలను కూడా శిక్షణలో వివరిస్తారని డిప్యూటి ఎంపీడీఓ సత్యన్నారాయణ అన్నారు.