ఆన్ లైన్ లో "ఇంటి యజమాని పేరు" గల్లంతు రాజకీయ కుట్రలతోనే తొలగింపు ఆడపిల్ల పెండ్లి ఆగిపోవాలని కుట్రలు - కుతంత్రాలు పన్నిన పాలకులు పిర్యాదు చేసినా పట్టించుకోని పంచాయతీ అధికారులు చచ్చిపోయిన కార్యదర్శి పాషా పై తప్పుడు ఆబండాలు అసత్యపు సమాచారం ఇచ్చిన ఎంపీఓ అఫ్జల్ మియా పంచాయతీ కమీషనర్ వరకు వెళ్లినా... పరిష్కాం కాని సమస్య పోలీసులకు కూడా పిర్యాదు చేసిన బాధితుడు
ఆన్ లైన్ లో "ఇంటి యజమాని పేరు" గల్లంతురాజకీయ కుట్రలతోనే తొలగింపుఆడపిల్ల పెండ్లి ఆగిపోవాలని కుట్రలు - కుతంత్రాలు పన్నిన పాలకులుపిర్యాదు చేసినా పట్టించుకోని పంచాయతీ అధికారులుచచ్చిపోయిన కార్యదర్శి పాషా పై తప్పుడు ఆబండాలుఅసత్యపు సమాచారం ఇచ్చిన ఎంపీఓ అఫ్జల్ మియా పంచాయతీ కమీషనర్ వరకు వెళ్లినా... పరిష్కాం కాని సమస్యపోలీసులకు కూడా పిర్యాదు చేసిన బాధితుడుబుగ్గారం / జగిత్యాల జిల్లా :జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ రికార్డుల ఆన్ లైన్ లో ఇంటి యజమాని పేరు గల్లంతు అయ్యింది. బాధితుడు చుక్క గంగారెడ్డి గురువారం విలేఖరులకు తెలిపిన కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బుగ్గారం గ్రామ పంచాయతీ పరిధిలో 9-14/8/3 నంబర్ గల ఇల్లు భార్య భర్తల ఇద్దరి పేరున ఉమ్మడి ఆస్థిగా కలదు. తన కుమార్తె వివాహం కోసం ఆ ఇంటి పై ఋణం తీసుకునేందుకు ఇద్దరి పేర్లతో అప్పటి పంచాయతీ కార్యదర్శి నరేందర్ 2023 లోఓనర్షిప్ సర్టిఫికెట్ కూడా జారీ చేశారు. బ్యాంక్ లోన్ కొరకు దరఖాస్తు చేసుకోగా ఆన్ లైన్ లో కేవలం తన భార్య పేరు ఒక్కటి మాత్రమే ఉండి తన పేరు గల్లంతు అయింది. దీనితో బ్యాంకు అధికారులతో పాటు బాధితుడు చుక్క గంగారెడ్డి అవాక్కయ్యారు. తనకు బ్యాంక్ లోన్ రాకుండా పోవడమే కాకుండా కుమార్తె వివాహం కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడ్డది. బుగ్గారం గ్రామ పంచాయతీలో జరిగిన భారీ నిధుల దుర్వినియోగాన్ని బయటకు తీసి ఉన్నతాధికారులకు, న్యాయస్థానాలకు పిర్యాదులు చేసినందులకే కుట్రతో తన పేరు తొలగించారని చుక్క గంగారెడ్డి విలేఖరులతో ఆరోపించారు.ఒక ఆడబిడ్డ అయిననా కుమార్తె పెండ్లి ఆగిపోవాలని బుగ్గారం పాలకులు కుట్రలు - కుతంత్రాలు పన్ని ఉద్దేశ్య పూర్వకంగా పంచాయతీ కార్యదర్శి నరేందర్ తో ఆన్ లైన్ లో ఇంటి యజమానిగా తన పేరును తొలగింప జేశారని ఆరోపించారు. స్థానిక రాజకీయ నాయకులతో కుమ్మక్కైన అప్పటి పంచాయతీ కార్యదర్శి నరేందర్ కూడా తన విధులను, తన ఉద్యోగ బాధ్యతలను మరచి ఇలా చేయడం చట్ట విరుద్ధమని, అన్యాయ మని తెలిపారు.గత రెండు ఏండ్ల నుండి నరేందర్ దృష్టికి, సంబంధిత పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఎన్ని పిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. ఆన్ లైన్ లో ఇంటి యజమానిగా తన పేరు నమోదు చేయాలని మండల పంచాయతీ అధికారి అఫ్జల్ మియాకు దరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు. ఆయన కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ తప్పు చేసిన పంచాయతీ కార్యదర్శి నరేందర్ ను, కుట్రదారులైన గ్రామ పంచాయతీ పాలకులను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపించారు. ఎంపివో అఫ్జల్ మియా ఉద్దేశ్య పూర్వకంగా ఆర్టీఐ ద్వారా కూడా పొంతన లేని, తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన ఆవేదన చేశారు. ఎప్పుడో పని చేసి బదిలీ పై వెళ్ళిపోయి ఆ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన మహబూబ్ పాషా నే 2019లో మీ పేరు ఆన్ లైన్ లో తొలగించారని తప్పుడు, అసత్యపు సమాచారం ఇచ్చాడని సూచించారు. 2019 లో మహబూబ్ పాషా నే రికార్డులలో నా పేరు తొలగిస్తే 2023 లో ఉన్న పంచాయతీ కార్యదర్శి నరేందర్ ఉమ్మడి అస్థిగా ఇద్దరి పేరున ఓనర్షిప్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తే ఎంపీవో అఫ్జల్ మియా ముఖం చాటేశారని వివరించారు. తన సమస్య పరిష్కారం కోసం మండల పంచాయతీ అధికారి నుండి జిల్లా పంచాయతీ అధికారి ద్వారా తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ కమీషనర్ హైదరాబాద్ వరకు ప్రతిపాదనలు తీసుకెళ్ళి ఈ సమస్య పరిష్కారం చేయాలని బాధితుడు చుక్క గంగారెడ్డి కోరడం జరిగిందన్నారు. పంచాయతీ రాజ్ కమీషనర్ దృష్టికి వెళ్లి రెండు నెలలు గడుస్తున్నా.... గత రెండు ఏండ్ల నుండి ఈ సమస్య పై బాధితుడు న్యాయ పోరాటం చేస్తున్నా.... అధికారులు పరిష్కారం చేయడం లేదన్నారు. ఆన్ లైన్ లో తన పేరు యధావిధిగా నమోదు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. స్థానిక పోలీస్ అధికారులకు సైతం ఇట్టి విషయంపై పిర్యాదు చేస్తూ పంచాయతీ కార్యదర్శి నరేందర్ తో పాటు కుట్ర దారులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందని చుక్క గంగారెడ్డి సూచించారు. మండల పంచాయతీ అధికారికి కూడా మరోసారి పిర్యాదు చేస్తూ తప్పుడు సమాచారంతో నిందితులను కాపాడడం కోసం చచ్చిపోయిన గత పంచాయతీ కార్యదర్శి మహబూబ్ పాషా పై తప్పుడు ఆబండాలు మోపడం సరికాదని సూచించారు.తప్పు చేసిన పంచాయతీ కార్యదర్శి నరేందర్ తో పాటు దీని వెనుకాల ఉన్న కుట్ర దారులైన పాలకులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేస్తూ, తగిన నష్ట పరిహారం కూడా ఇప్పించాలని ఎంపివో అఫ్జల్ మియా ను కోరినట్లు చుక్క గంగారెడ్డి వివరించారు. లేని పక్షంలో న్యాయస్థానాలను కూడా ఆశ్రయించి ఇలాంటి కుట్రలు మరెక్కడా జరుగకుండా నిందితులకు సరైన కఠిన శిక్ష పడే విధంగా పోరాటం చేస్తూ...తనకు జరిగిన అన్యాయం పై, నష్టంపై ధర్మ యుద్ధం కూడా చేస్తానని పేర్కొన్నారు.