logo

త్వరలో కోర్టుల ద్వారా సత్వర న్యాయం -సీనియర్ న్యాయవాది నిప్పాని సత్యనారాయణ మూర్తి

సుప్రీం కోర్ట్ గైడలైన్స్ అనుసరించి mediation and conciliation ప్రాజెక్టులో భాగంగా సీనియర్ న్యాయవాదులకు మీడియేషన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు సంబంధించి 70 మంది న్యాయవాదులు తనతో సహా పూర్తి చేసుకున్నారని సీనియర్ న్యాయవాది నిప్పాని సత్యనారాయణ మూర్తి గారు తెలిపారు.

AIMA మీడియా సీనియర్ న్యాయవాది సత్యనారాయణ మూర్తి గారిని కలసినప్పుడు
దేశంలో రోజు కి సివిల్, క్రిమినల్ కేసులు వేల మీద కోర్టులలో ఫైల్ అవుతున్నాయ్యని, అంత స్థాయిలో జడ్జిల నియామకం జరగడం లేదని, జడ్జిల కొరత కారణంగా కేసులు పరిష్కారం కత్తి మీద సామూలా మారిందని, ఇటువంటి పరిస్థితులలో కక్షి దారుల, కేసుల పరిష్కారానికి మద్యేమార్గంగా మీడియేషన్ పనిచేస్తుందని, సీనియర్ న్యాయవాదులకు దేశావ్యాప్తంగా ట్రైనింగ్ ఇచ్చి కేసుల పరిష్కారంలో జడ్జిలకు సహాయ కారిగా ఉండటమే కాకుండా కక్షి దారులకు సత్వర న్యాయం ఈ మీడియేషన్ ద్వారా లభిస్తుందని, ప్రపంచంలోనే ఈ మీడియేషన్ విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి దేశం భారత దేశమేనని సీనియర్ న్యాయవాది తెలిపారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న న్యాయవాదులకు సర్టిఫికెట్ లు అందుకున్నారని, త్వరలో వీరి సేవలు దేశ వ్యాప్తంగా కోర్టులు ఉయోగించుకుంటాయాన్ని శ్రీ సత్యనారాయణ మూర్తి తెలిపారు.

26
5435 views