logo

పోతిరెడ్డిపాడు నుండి నీటిని విడుదల చేయాలని డిమాండ్... వైఎస్ఆర్సిపి రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగాల భరత్ కుమార్ రెడ్డి

నంద్యాల, జూన్ 27, AIMAమీడియా
రొక్కం నాగేశ్వర రెడ్డి:
-----------------------------------------
శ్రీశైలం జలాశయంలో నీరు ఎనిమిది వందల యాభై నాలుగు (854) అడుగులకు వచ్చి ఈరోజు 865 అడుగులకు చేరుకుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమకు నీటి విడుదల చేయకుండా చోద్యం చూస్తుందని ఆయన విమర్శించారు.

రాయలసీమ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటి తాగునీటి కూడా కొన్ని గ్రామాల్లో ఇబ్బందిగా ఉందని ,జూన్ మొదటి వారంలో వర్షాలు పడటంతో రైతులు పంటలు సాగు చేశారని ఆ తర్వాత వర్షాభావ పరిస్థితులు ఏర్పడి పంటలను దున్ని వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది కానీ ఎగువన కురిసిన వర్షానికి శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు రావడం జరిగింది ఇలాంటి పరిస్థితులు ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు చేరిన వెంటనే పోతిరెడ్డిపాడు నుండి నీటిని విడుదల చేయాలి కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత కొన్ని రోజులుగా చోద్యం చూస్తుంది.

గత సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్ లో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది పొగాకు మిర్చి రైతులు ఆత్మహత్యలు మనం ప్రతి దినం చూస్తున్నాం. ఈ సంవత్సరం త్వరగా వర్షాలు రావడం రైతులు పంటలు సాగు చేశారు కానీ వాటిని కాపాడుకోలేని పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది పోతిరెడ్డిపాడు నీటిని విడుదల చేయడం వల్ల కనీసం కొంతమంది రైతుల కైనా ఉపయోగపడే అవకాశం ఉంది కావున ప్రభుత్వం నిద్రను విడి రాయలసీమ రైతును ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొసికి తిరుమలేశ్వర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నాగార్జున రెడ్డి . మండల కన్వీనర్ తోకల కృష్ణారెడ్డి. సిపిఐ రైతు సంఘం నుండి వెంకటేశ్వర్లు, సిపిఎం రైతు సంఘం నుండి నరసింహులు . పల్లె గోపాల్ రెడ్డి, యువ నాయకుడు తరుణ్ కుమార్ రెడ్డి వివిధ గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది

1
185 views