logo

ఇల్లందు సీఐ బత్తుల సత్యనారాయణ అనుమతి లేకుండా, అభిప్రాయం తీసుకోకుండా ఎలాంటి వార్తలు ప్రచురించవద్దని తను జర్నలిస్టులను కోరారు

*భార్యాభర్తల పంచాయతీ విషయంలో ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడం జరిగిందని ఇల్లందు సిఐ సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇదే విషయంపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతుందని తెలిపారు. తాను నా అభిప్రాయాన్ని పాత్రికేయుల వద్ద ఏ ఇతర వ్యక్తుల వద్ద వ్యక్త పరచలేదని కానీ పాత్రికేయులు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఆపాదించుకుంటున్నారని పేర్కొన్నారు. దయచేసి నాపై కానీ, ఉన్నతాధికారులను ఉద్దేశించి ఎలాంటి వార్తలు రాయవద్దని మనవి చేశారు. ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు నడుచుకుంటానని తెలిపారు. ఇకపై తన అనుమతి లేకుండా, అభిప్రాయం తీసుకోకుండా ఎలాంటి వార్తలు ప్రచురించవద్దని జర్నలిస్టులను కోరారు

52
2777 views