
అవినీతి లేకుండా ఏ ప్రభుత్వ శాఖలోను పౌర సేవలు నడవటం లేదు.
రసాయనాలు,ప్రమాద కరమైన రసాయనిక మురుగు,ఇతర వ్యర్థాలు నదుల్లోను,చెరువుల్లోని నేరుగా కలిపేసుకోండని, ప్రతినెలా అందుకు తగ్గట్టు అవినీతి వాటా మాకు పంపండి అని ప్రయివేట్ దళారుల ద్వారా పారిశ్రామిక వర్గాల నుండి ముడుపులు తీసుకుంటు అధికార దుర్వినియోగ విధులు నిర్వహిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.
అవినీతి లేకుండా ఏ ప్రభుత్వ శాఖలోను పౌర సేవలు నడవటం లేదని, అవినీతి చేస్తు ఏసీబీ వారికి పట్టుబడి జైలుకు వెళ్లిన వారి ఫొటోలు సంబంధిత కార్యాలయాల వద్ద నోటిస్ బోర్డులో ప్రకటించి ప్రజలను అప్రమత్తం చేస్తు ఇతర ఉద్యోగులు నిజాయతిగా సేవలు అందించే విధంగా ప్రోత్సహించాలని, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ )ప్రస్తుతం వున్నా లేనట్టుగానే వుందని, అవినీతి లో రెండవ స్థానంలో వున్న పోలీస్ శాఖ నుండే ఏసీబీ శాఖ విధులు అమలు కావటం మంచి పరిణామాలు కావని,ఏసీబీ,విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, స్పెషల్ బ్రాంచ్, ఇంటిలిజెన్స్ విభాగాలు పోలీస్ శాఖతో కలిసి ఉన్నన్నాళ్ళు ఆ శాఖల పనితీరు మెరుగుపడదని, ఇప్పుడున్న ఈ శాఖల పనితీరు యుద్ద ప్రాతి పదికన మార్పులు చేయకపోతే ఈ శాఖలు తో ప్రభుత్వానికి,ప్రజలకు ఎందుకు ఉపయోగం వుండదని,దూర ద్రుష్టి తో ప్రభుత్వాలు ఈ లోపాన్ని గుర్తించి ఈ శాఖల ను ప్రత్యేక విభాగాలుగా విభజించి ప్రత్యేక శాఖలుగా అధికారిక గుర్తింపు నివ్వాలని ప్రజలు కోరుతున్నారు.
అనేక ప్రభుత్వ శాఖల్లో ప్రజా విజ్ఞాపనలు, రెగ్యులర్ ఫైళ్లను నెలలు సంవత్సరాలు తరబడి కాల యాపనతో విధులు నిర్వహిస్తున్నారని, అత్యధిక శాతం ఉద్యోగులు కాలక్షేపంగా ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్నారని,సర్వీస్ రూల్స్ ను,పబ్లిక్ సర్వెంట్ యాక్ట్ ను కనీసం అనుసరించుటం లేదని, రోజులు,సంవత్సరాలు తరబడి కార్యాలయాలు చుట్టు తిరిగిన శ్రమ తప్ప ఫలితం వుండటం లేదని, పర్సెంటేజిలకు అలవాటు పడిన పై అధికారులు కాలయాపన విధులు పై దృష్టి సారించలేక పోతున్నారని,అనేక సందర్బాలలో *సమాచార హక్కు చట్టం* ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారికి కోరిన సమాచారం కన్నా వక్రీకరించి అవాస్తవాల తోనే సమాచారం ఇస్తు తీవ్ర జాప్యానికి కారకు లైతున్నారని,కొన్ని కొన్ని సందర్భాలలో అవినీతి ఉద్యోగులు సంఘ విద్రోహులతో చేతులు కలిపి శాంతి భద్రతల సమస్యలు కు కారకులవు తున్నారు.
* మండల్ సమాచార కేంద్రం. MCIC. ఇంచార్జ్ బొబ్బిలి
*
*కన్స్యూమర్ రైట్స్ ప్రోటక్షన్ ఫోరం. ఆంధ్రప్రదేశ్.🇮🇳CRPFI 🇮🇳 సత్యమేవ జయతే🇮🇳 జైహింద్🇮🇳