సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ ద్వారా రైతులకు మేలు చేయండి...
సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ను కలిసిన డైరెక్టర్ నరహరి విశ్వనాధ్ రెడ్డి
నంద్యాల, జూన్ 28,AIMA మీడియా
ఆర్ ఎన్ రెడ్డి:
--------------------------------------------
సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ ద్వారా రైతులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకోవాలని సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ నరహరి విశ్వనాధ్ రెడ్డి కోరారు.
శనివారం విజయవాడలోని సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ కార్యాలయంలో చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో డైరెక్టర్ నరహరి విశ్వనాధ్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆలోచనకు అనుగుణంగా రైతులకు మేలు జరిగే విధంగా సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ నిర్ణయాలు ఉండాలని కోరారు. సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ ద్వారా నంద్యాలలో ఈ ప్రొక్యూర్ మెట్ చేపట్టి గోదాములు తీసుకొని రైతుల ధాన్యం నిల్వలకు సహకరించాలని, సివిల్ సప్లయ్ కి కూడా గోదాములు అద్దెకు ఇవ్వడం వల్ల మేలు జరుగుతుందని, కర్నూలులో ఉన్న డివిజనల్ సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ కార్యాలయాన్ని అనంతపురంకు తరలించ వద్దని ఆయన కోరారు.