
నంద్యాల మీదుగా నాందేడ్ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి నాందేడ్ కు వారాంతపు స్పెషల్ ఎక్స్ ప్రెస్ రైలు...
- నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
నంద్యాల, జూన్ 28, AIMA మీడియా (ఆర్ ఎన్ రెడ్డి):
నంద్యాల మీదుగా నాందేడ్ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి నాందేడ్ కు వారాంతపు ఎక్స్ ప్రెస్ రైలు నడుపనున్నట్లు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి శనివారం తెలిపారు.
తన అభ్యర్థన మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రయాణికుల రద్దీ కారణంగా వారంతపు నాందేడ్ _ తిరుపతి_నాందేడ్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ను జూలై నెలలో రైలు నెంబర్ 07189 ప్రతి శుక్రవారం నాందేడ్ లో సాయంత్రం 4:30 గంటలకు బయలుదేరి నిజామాబాద్ మీదుగా చర్లపల్లి కి రాత్రి 9:30 గంటలకు బయలుదేరి నల్గొండ, పిడుగురాళ్ల, మార్కాపురం, గిద్దలూరు మీదుగా నంద్యాలకు శనివారం ఉదయం 5:30 గంటలకు వచ్చి, మళ్ళీ 5:35 గంటలకు తిరుపతికి వెళుతుందని, రైలు నెంబర్ 07190 తిరుపతి_ నాందేడ్ మళ్ళీ తిరుపతి లో ప్రతి శనివారం మధ్యాహ్నం 2:20 గంటలకు బయలుదేరి నంద్యాలకు రాత్రి 7:45 గంటలకు చేరుకొని చర్లపల్లి కి బయలదేరి ఆదివారం ఉదయం 1:40 గంటలకు చేరుతుందని, అదే రైలు నిజామాబాద్ మీదుగా నాందేడ్ కు ఉదయం 9:30 గంటలకు చేరుతుందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వివరించారు. జూలై నెలలో మొత్తం 8 ట్రిప్పులు ఈ వారాంతపు ప్రత్యేక రైళ్లు తిరుగుతాయని, ఈ స్పెషల్ ఎక్స్ ప్రెస్ లు ఏర్పాటు చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. నంద్యాల పార్లమెంట్ పరిధిలోని ప్రయాణికులు ఈ వారంతపు స్పెషల్ ఎక్స్ప్రెస్ లను ఉపయోగించాలని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు.