
జులై 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదంచేయండి
ఐసిడిఎస్ కార్యాలయ సిబ్బందికి సమ్మె నోటీస్ అందచేసిన యూనియన్ నాయకులు
నూతనంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి
సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎం శంకర్ నాయక్
జులై 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదంచేయండి
ఐసిడిఎస్ కార్యాలయ సిబ్బందికి సమ్మె నోటీస్ అందచేసిన యూనియన్ నాయకులు
నూతనంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి
సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎం శంకర్ నాయక్
అచ్చంపేట, జూన్ 28,:నాగర్ కర్నూలుజిల్లాఅచ్చంపేట పట్టణం లో దశాబ్ద కాలంగా కార్మిక శ్రామిక వర్గ నేతలు అనేక త్యాగాలుపోరాటాలతోసాధించుకున్న 29కార్మికచట్టాలను రద్దు చేసి వాటిని కేవలం నాలుగు లేబర్ కోడ్లు గా తీసుకొచ్చి వాటి అమలుకుకేంద్రంలోనిబిజెపిప్రభుత్వం తీవ్రంగాప్రయత్నిస్తుందని వాటికి వ్యతిరేకంగా జులై 9వతేదీనదేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదంచేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎం శంకర్ నాయక్ కార్మికులనుకోరారు.
అచ్చంపేట ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయసిబ్బందిజూనియర్, అసిస్టెంట్ సుధాకర్ కుసిఐటియుకార్మిక సంఘంఆధ్వర్యంలో సమ్మె నోటీసు ను అందజేశారు.
ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ.. నాలుగు లేబర్ కోడ్ లు అమలు జరిగితే కార్మిక సంఘాల ఏర్పాటు కష్టతరమవుతుందని కార్మికుల సమిష్టి భేరాసారాల శక్తి నిర్వీర్యంచేయబడుతుందని,సమ్మెకుసైతంపరమితులు ఏర్పడతాయని, ఉద్యోగభద్రతఉపాధి కోల్పోతారని, కార్మిక శాఖ కూడా నిర్వీర్యంచేయబడుతుందనిఆయనఆవేదనవ్యక్తంచేశారు.2025 జూలై 9న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలోఅంగన్వాడీ టీచర్స్,అండ్,హెల్పర్స్ అధిక సంఖ్యలో పాల్గొని సమ్మెనుజయప్రదం చేయాలని ఆయన అన్నారు.దేశవ్యాప్తంగా రద్దు చేసిన కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని అంగన్వాడి లను కార్మిక చట్టాల పరిధిలోకి తేవాలని పర్మినెంట్ పైన గుజరాత్ హైకోర్టు ఆదేశాలనుఅంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్స్ గ్రాట్యూటీపైనసుప్రీంకోర్టుఆదేశాలను తక్షణమే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. అంగన్వాడీటీచర్లకు హెల్పర్లకురెగ్యులరైజ్ చేస్తూ హెల్పర్లకు 26,000 మరియు టీచర్లకు 32,000 కనీసవేతనంప్రకటించాలనిడిమాండ్,చేశారు.రిటైర్మెంట్ అయినా అంగన్వాడీ టీచర్లు ఆయాలకు కనీసం 9, 000లపెన్షన్ ఇవ్వాలని, 45వ మరియు 46వ ఐ ఎల్ సి యొక్క సిఫారసులు ప్రకారం పెన్షన్ ఈఎస్ఐ పిఎఫ్ మొదలైనసౌకర్యాలు కల్పించాలి నూతన జాతీయ విధానాన్నిఉపసర్పరించుకోవాలి నిర్బంధ విద్యా వ్యవస్థకు ఈసీసీని లింకు చేయరాదని ఆయన డిమాండ్ చేశారు. పెన్షన్ ఎక్స్గ్రేషన్ మరియు ఇతర సామాజిక భద్రత చర్యలు నిర్ధారించే వరకు ఉద్యోగాల నుండితొలగించరాదనిడిమాండ్చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దేశా నాయక్ అంగన్వాడీ యూనియన్ నాయకురాలు పార్వతమ్మ భారతి చంద్రకళ, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జయ చంద్రకళ సంతూలి రమ పద్మ మంగమ్మ మేఘమాల సంతోషి విజయ తదితరులు పాల్గొన్నారు.