logo

దివ్యాంగులకు ఇంటిస్థల పట్టాతో పాటు పక్కా ఇల్లు మంజూరుకు కృషి చేస్తా... - ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

నంద్యాల/ నందికొట్కూరు, జూన్ 28, AIMA మీడియా(ఆర్ ఎన్ రెడ్డి):

దివ్యాంగుల విన్నపం మేరకు మీకు ఇంటి స్థలంతో పాటు పక్కాగృహలు మంజూరుకు కృషి చేస్తానని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి హామీ ఇచ్చారు.

శనివారం నందికొట్కూరు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో అసెస్మెంట్ ఏ డి ఐ పి పథకం ద్వారా
వికలాంగులు, వృద్ధులకు
ఉచిత పరికరాలు పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.

ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ మనందరి టీడీపీ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ఏడాది పాలనలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలు 90 శాతం నెరవేర్చారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విభిన్న ప్రతిభావంతుల సమస్యలు తొలగించడం జరుగుతుందన్నారు.
కొందరు దివ్యాంగులు
ఇళ్ల పట్టాలు ఇప్పించి పక్కా గృహాలు మంజూరు చేయించాలని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిని కోరడంతో మీకు అండగా ఉంటూ నా జిల్లా లోని అర్హులైన దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇంటి స్థలంతో పాటు పక్కా గృహాలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు పల్లె రఘురామిరెడ్డి, నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహాక కార్యదర్శి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి, నందికొట్కూరు మండల స్థాయి అధికారులు పాల్గొని దివ్యాంగుల, వృద్ధుల ప్రత్యేక శిబిరంను విజయవంతం చేశారు,

2
282 views