logo

వక్ఫ్ సవరణ 2025 చట్టంను రద్దు చేయాలి.

నంద్యాల జిల్లా/ఆళ్లగడ్డ (AIMA MEDIA):
ఆళ్లగడ్డ పట్టణంలోని గౌసియా మస్జిద్ నందు ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు పిలుపుమేరకు ఆళ్లగడ్డ జేఏసీ కన్వీనర్ బీరువాళ్ళ భాషా ఆధ్వర్యంలో కుల సంఘాల నాయకులు ప్రజాసంఘాల నాయకులు పట్టణ పుర ప్రముఖులు వక్ఫ్ బోర్డు సవరణ చట్టంపై చర్చా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు వర్క్స్ సవరణ చట్టం వల్ల ముస్లిం సమాజానికి జరిగే నష్టాన్ని వివరించారు అనంతరం నాయకులంతా కలిసి కరపత్రాలను గోడపత్రాలను ఆవిష్కరించారు.. కార్యక్రమంలో అఖిలభారత రజక సంఘం నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు ఆమడాల రమణ, హ్యూమన్ రైట్స్ మూమెంట్ జస్టిస్ నాయకులు, ప్రముఖ న్యాయవాది హాజీ గౌస్, మరియు ఆళ్లగడ్డ పుర ప్రముఖులు నూర్ భాషా, ఎలక్ట్రీషియన్ బాజాన్, తదితర సంఘాల నాయకులు, ఆవాస్ కమిటీ సభ్యులు ఇస్మాయిల్ బేగ్, మసీదుల, ఆయిల్ బషీర్ బాబా సభ్యులు పాల్గొన్నారు.

0
55 views