logo

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం తెలంగాణ జన సమితి - మెట్ పల్లిలో జరిగిన ఉమ్మడి జిల్లాల సమావేశం

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం

- తెలంగాణ జన సమితి
- మెట్ పల్లిలో జరిగిన ఉమ్మడి జిల్లాల సమావేశం

మెట్ పల్లి / జగిత్యాల జిల్లా:

స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ జన సమితి పార్టీ పక్షాన పోటీ చేస్తామని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల ముఖ్య నాయకులు తేల్చి చెప్పారు. రాష్ట్ర పరిశీలకుల పర్యవేక్షణలో శనివారం మెట్ పల్లి లోని కంతి మోహన్ రెడ్డి స్వగృహంలో గల పార్టీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లాల ముఖ్య నాయకులతో ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు. పార్టీ పక్షాన ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తో అలయన్స్ లో గానీ, ఒంటరిగా గానీ పోటీ చేయడానికి సిద్దం కావాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన తో పాటు గత పదేండ్ల నిరంకుశ పాలనలో కూడా ఉద్యమ కారులుగా తెలంగాణ జన సమితి పార్టీ నేతలు, కార్యకర్తలు చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా కృషి చేసిన తీరును వివరించారు.
ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పోటీ చేసి తప్పకుండా గెలవబోయే స్థానాల వివరాలను రాష్ట్ర ఎన్నికల పరిశీలకులకు ఆయా జిల్లాల అధ్యక్షులు వివరించారు. ఎంపిటిసి, జడ్పీటిసి, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయడమేనని నిర్ణయించారు. స్థానికంగా ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ సమయస్పూర్తితో పోరాటం చేస్తున్న పార్టీ నేతలను, కార్యకర్తలను ఈ సందర్భంగా అభినందించారు. ఈ సమావేశంలో తెలంగాణ జన సమితి పార్టీ ఎన్నికల సన్నాహక సబ్ కమిటీ నాయకులు కుంట్ల ధర్మార్జున్, గోపగాని శంకర్ రావు, కంతి మోహన్ రెడ్డి, నిజ్జన రమేష్, రాష్ట్ర నాయకులు ముక్కెర రాజు, సర్దార్ వినోద్ కుమార్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, బొజ్జ కనకయ్య, ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ ఆరేపల్లి విజయ్ కుమార్, మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు అరికెళ్ల స్రవంతి, కరీంనగర్ జిల్లా కన్వీనర్ మోర గణేష్, కరీంనగర్ జిల్లా యువజన సమితి అధ్యక్షులు కర్రే సతీష్ యాదవ్, జగిత్యాల జిల్లా కార్యదర్శి చింతకుంట శంకర్, నాయకులు కాట దశరథ రెడ్డి, ఏశాల గంగారెడ్డి, కంతి రమేష్, శనిగరపు అశోక్, వన్నెల శశి కుమార్, మ్యాన సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

6
197 views