logo

గోవుల పట్ల దయ చూపండి మహా ప్రభో - గొల్లపల్లి స్పందించిన మునిసిపల్ చైర్మన్ రత్నాజీ

అను నిత్యం తుని మార్కెట్ లో తిరిగే ఆవులు ఆక్సిడెంట్ లకు గురి అయ్యి గాయల పాలయ్యి మృతి చెందుతున్నాయని, కనీసం పట్టించుకునే నాదుడే కరువయ్యారని నేను సైతం అధ్యక్షులు గొల్లపల్లి వీర బాబు వాపోయారు.
ఆవులను పెంచుకుంటున్న వాళ్ళు వాటిని మేప లేక యాదేచ్చగా రోడ్ల మీదకు వదులుతున్నారని, అవి ట్రాఫిక్ కి అడ్డంగా ఉండడమే కాకుండా తరచూ వేగంగా వెళ్లే వాహనాలను గుద్దుకుని గాయల పాలు అవుతున్నాయని, శనివారం ఉదయం ఒక ఆవు దూడ ఆక్సిడెంట్ కి గురి అయ్యి చావు బతుకుల స్థితిలో ఉంటే తాము పట్టించుకుని వైద్య చికిత్స చేయిస్తునామని, వాహనంలో తరలించలేని స్థితిలో రోడ్డు మీదే వైద్య సహాయం అందించామని, అయితే కొంతమంది వ్యాపారులు రోడ్డు మీద పడి ఉన్న ఆవును చూసి తమ వ్యాపారలకు అడ్డంగా ఉందని, కంప్లైంట్ ఇవ్వడం తో మునిసిపల్ వర్కర్స్ వచ్చి గోవును తరలించే ప్రయత్నం చేస్తుండటం తో గొల్లపల్లి వీరబాబు అడ్డుకుని ఎక్కడికి తరలిస్తున్నారని ప్రశ్నించగా డంపింగ్ యార్డ్ కు తరలిస్తామని చెప్పడంతో, వైద్యం ఆడించక పోగా, కోన ఊపిరితో ఉన్న ఆవును డంపింగ్ యార్డ్ కు తరకిస్తారా అని స్థానికుల సహాయంతో తరలింపును గొల్లపల్లి అడ్డుకున్నారు, వెంటనే మునిసిపల్ chairman రత్నాజీ గారిని వీర బాబు సంప్రదించగా తాను డంపింగ్ యార్డ్ కు తరలించమని చెప్పలేదని, ఆవులను సురక్షితంగా అన్నవరం గోశాలకు తరలిస్తామని చెప్పడమే కాకుండా, అన్నవరం గోశాల సిబ్బందికి ఫోన్ చేసి మార్కెట్లో ఉన్న గోవులను సురక్షితం గా గోశాలకు తీసుకెల్లాలని అక్కడ సిబ్బందిని అదేసించారు. తక్షణ చర్యలు మునిసిపల్ చైర్మన్ తీసుకున్నందుకు మునిసిపల్ చైర్మన్ కు ధన్యవాదములు గొల్లపల్లి తెలియచేసారు

5
29 views