logo

విద్యుత్ పునరుద్ధరణ జరిగిన వెంటనే తాగునీటి సరఫరా


గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రేగిడిలోని పంపు హౌస్ కు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగలేదు. ఈ కారణంగా
రాజాం మున్సిపాలిటీలో తాగునీటి సరఫరా కు అంతరాయం కలుగుతోందని, రాజాం మున్సిపాలిటీ పరిధిలో కొన్ని ప్రాంతాలలో ట్యాంకుల ద్వారా త్రాగునీరు సప్లై జరుగుతుందని మున్సిపల్ ఏఈ రామ్ వెంకట్ రాజు తెలిపారు.
పై విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.
విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ జరిగిన వెంటనే నీటి సరఫరా జరుగుతుందని తెలిపారు.

147
5229 views