వాడా వాడల్లో ఘనంగా బోనాలు సమర్పణ
ఆషాడ మాసం ఆఖరి ఆదివారం సందర్భంగా లక్ష్మీదేవిపల్లి బొడ్రాయి వద్ద మరియు వార్డులో గల పోచమ్మలకు బోనాలను పలువురు ప్రజలు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు భక్తి శ్రద్ధలతో నైవేద్యాలను వండి బోనంతో గ్రామదేవతల ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు.