logo

మాజీ ఎమ్మెల్యే దుగ్యాల సేవలు స్ఫూర్తిదాయకం తొర్రూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి

తొర్రూరు, ఆగస్టు 16(AIMEMEDIA)
చెన్నూరు (పాలకుర్తి) మాజీ ఎమ్మెల్యే దివంగత నేత దుగ్యాల శ్రీనివాసరావు సేవలు అభినందనీయమని తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతిరెడ్డి అన్నారు.శనివారం మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో దుగ్యాల శ్రీనివాసరావు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు వెల్తూరి మల్లేశం, సభ్యులు మిట్టకోల లక్ష్మణ్ ల ఆధ్వర్యంలో నిర్వహించినమహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ కాకిరాల హరి ప్రసాద్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామ సహాయం కిషోర్ రెడ్డి లతో కలిసి ఆయన మాట్లాడుతూ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో వేలకోట్ల రూపాయలు తెచ్చి తొర్రూరు, పాత చెన్నూర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన మహానీయుడని అన్నారు. నియోజకవర్గంలోని గ్రామాలు, తండాలకు రోడ్లు,తొర్రూరులో జూనియర్ సివిల్ కోర్టు, డిగ్రీ కళాశాల,మున్సిపాలిటీ భవనం, సెంట్రల్ లైటింగ్ లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, రైతుల కోసం సబ్ స్టేషన్ ల నిర్మాణానికి కృషి చేశాడని కొనియాడారు. దుగ్యాల లాంటి మంచి నాయకున్ని ఈ ప్రాంత ప్రజలు కోల్పోయారని అన్నారు. ఆయన ఆశ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.సుమారు 800 మందికి అన్నదానం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తొర్రూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంచు సంతోష్, ఏఎంసి వైస్ చైర్మన్ గుగులోతు బట్టు నాయక్, మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మెరుగు మల్లేశం గౌడ్, కాంగ్రెస్ నాయకులు అనుమాండ్ల నరేందర్ రెడ్డి, దేవరకొండ శ్రీనివాస్, నలుగురి రామలింగం, చిట్టిమల్ల మహేష్, వేల్పుల ఐలయ్య,అంగన్వాడీ టీచర్లు శైలజ, సుకన్య, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

1
25 views