
స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు గ్రామాలకు వెళ్లి, జాబ్ క్యాలెండర్ ఎక్కడ అని ప్రశ్నించాలి
స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు వెల్తూరి సాయికుమార్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరికి వస్తున్న సమయంలో విద్యార్థులు నిరుద్యోగులు మహిళలు అందరూ పల్లె బాట పట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదించాల్సిన అవసరం ఉందని అన్నారు
విద్యార్థులు:-గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు అంతా ఏకమై వారిని ఎలక్షన్లో బొందపెట్టి ఏరి కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసి విద్యార్థుల ను నమ్మించి గొంతు కోసింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు
నిరుద్యోగులు:-గత ప్రభుత్వంలో అనేక ఉద్యమాలు చేసి నిరుద్యోగ జేఏసీ ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగులు అందరూ ఓటు వేయాలని ప్రచారం చేసి గద్దనెక్కించుకుంటే ఈరోజు నిరుద్యోగుల గురించి పట్టించుకోకుండా జాబ్ క్యాలెండర్ వెయ్యకుండా దివాలా తీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి నిరుద్యోగులకు అండగా నిలవాలని స్థానిక సంస్థల్లో ప్రతి ఒక్క నిరుద్యోగి నిలదీయాల్సిన అవసరం ఉంది.
మహిళలు:- కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు మహిళలకు స్కూటీ ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన రాహుల్ గాంధీతో స్కూటీలు ఇస్తాము అని చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు స్కూటీల ఊసే లేకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మహిళా కన్నా స్కూటీ ఇచ్చిందా అని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం.
ఈ కార్యక్రమంలో స్వేరో స్టూడెంట్స్ యూనియన్ నాయకులు ప్రతాప్, అజయ్, వెంకటేష్ ,చౌదరి ,శ్రీకాంత్, మహదేవ్ ,టికాజి, రాజు, గణేష్, శివ,శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.