logo

డా,,చిర్ర రాజు గౌడ్ కు విద్యా రత్న అవార్డు ప్రధానం చేసిన ఎస్ఆర్ఎఫ్ ఫౌండేషన్


కాకతీయ విశ్వవిద్యాలయం కేయూ పాలక మండలి సభ్యులు తెలుగు విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ డా,,చిర్ర రాజు గౌడ్ గారిని 2025 సంవత్సరానికి *విద్యారత్న పురస్కార అవార్డు”* కి ఎస్ఆర్ఎఫ్ శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఎంపిక చేసి నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని తెలుగు విశ్వవిద్యాలయం సెమినార్ హాల్ లో జరిగిన *గురుపూజోత్సవ సన్మానం* కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశ్రాంత ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ గారి చేతుల మీదుగా అవార్డును ప్రధానం చేస్తూ డా,,చిర్ర రాజు గౌడ్ ను ఎస్.ఆర్.ఫ్ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మ అమరేష్ గారు సన్మానం చేయడం జరిగింది అనంతరం తుమ్మ అమరేష్ మాట్లాడుతూ విద్యా రంగంలో రెండు దశాబ్దాలకు పైగా బోధన అనుభవం కలిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విద్యా రంగానికి విశేషమైన సేవలు అందించారు అంతేకాకుండా డాక్టర్ చిర్ర రాజు గౌడ్ విద్యార్థులను సమాజానికి ఉపయోగకరమైన జ్ఞానం అందించడం ద్వారా ఒక ప్రతిభావంతమైన విద్యావేత్తగా నిలిచారు కాబట్టి ఎస్ఆర్ఎఫ్ శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా విద్యారంగంలో కృషి చేసిన సేవకు గుర్తింపుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యావేత్త డా,,చిర్ర రాజు గౌడ్ గారికి ఈ సంవత్సరం *విద్యారత్న అవార్డుని* అందజేస్తున్నాం అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 200 టీచర్స్ కు గురుబ్రహ్మ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్.ఆర్.ఎస్ ఫౌండేషన్ అడ్వైజర్ చిరంజీవి ఇతర సభ్యులు పాల్గొన్నారు.

4
2006 views