మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్ ను కొట్టిన యువకులు...
వికారాబాద్లోని అనంతగిరి గుట్టలో నలుగురు పర్యాటకులు మద్యం మత్తులో హల్చల్ సృష్టించారు. తాండూర్ నుంచి వికారాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్పై వారు దాడి చేశారు.
ఈ ఘటనలో డ్రైవర్కు గాయాలయ్యాయి. బాధితుడు వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతగిరి గుట్ట ప్రాంతంలో ఇలాంటి ఘటనలు పెరిగిపోవడం పట్ల స్థానికులు, ఆర్టీసీ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..