logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కడప గర్వకారణం — ఇటలీ పార్లమెంటులో సదస్సులో గురు సుబ్రహ్మణ్యం, మొహమ్మద్ ముస్తాక్ పాల్గొన్నారు

రోమ్, ఇటలీ :
ఇటలీ పార్లమెంటులో “Health and Salvation Between God and Science: Hinduism Meets Scientific Research” అనే అంతర్జాతీయ సదస్సు నిన్న ఘనంగా జరిగింది. ఈ సదస్సు దైవతత్వం మరియు ఆధునిక విజ్ఞానం మధ్య ఉన్న అనుసంధానాన్ని చర్చిస్తూ, మానవ ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సును ప్రోత్సహించే వేదికగా నిలిచింది.

సదస్సులో పాల్గొన్న ప్రముఖులు:

స్వామిని శుద్ధానంద గిరి – కల్చర్ హెడ్, Unione Induista Italiana

పరమహంస స్వామి యోగానంద గిరి – వ్యవస్థాపకుడు, Unione Induista Italiana

అవ్వోకాటో ఫ్రాంకో ది మరియా జయేంద్రమాత – అధ్యక్షుడు, Unione Induista Italiana .

సెనేటర్ లూసియో మలాన్ – ఇటలీ రిపబ్లిక్ సెనేటర్ .

సెనేటర్ పావ్లా బినెట్టీ – ఇటలీ రిపబ్లిక్ సెనేటర్ .

అంబాసడర్ వాణి రావు – భారత రాయబారి, రోమ్ .

భారతీయ తెలుగు సమితి టొరినో తరఫున ప్రెసిడెంట్ గురు సుబ్రహ్మణ్యం మరియు జనరల్ సెక్రటరీ మొహమ్మద్ ముస్తాక్ ఈ మహోత్సవంలో పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాకు చెందిన గురు సుబ్రహ్మణ్యం ఇటలీ పార్లమెంటులో తెలుగు సమాజాన్ని ప్రతినిధిగా నిలిచారు. ఆయన పాల్గొనడం తెలుగు ప్రజలకు గర్వకారణమైంది.

సదస్సులో ఆయన మాట్లాడుతూ — “ఆరోగ్యం అనేది కేవలం శరీరానికి మాత్రమే కాదు, మనసు, ఆత్మ సమతుల్యతతో కూడిన సమగ్ర శ్రేయస్సు. ఆధ్యాత్మికత మరియు విజ్ఞానం కలసి నడవడం ద్వారానే మానవజాతి నిజమైన అభ్యున్నతిని పొందగలదు” అని తెలిపారు.

ఆయన ప్రసంగం అక్కడి నేతలు, శాస్త్రవేత్తలు, మరియు రాయబారుల ప్రశంసలు అందుకుంది. మొహమ్మద్ ముస్తాక్ గారు కూడా తెలుగు సమాజ తరఫున చురుకైన పాత్ర పోషించి, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా పాల్గొన్నారు.

కడప జిల్లాకు చెందిన గురు సుబ్రహ్మణ్యం మరియు మొహమ్మద్ ముస్తాక్ ఇటలీ పార్లమెంటులో పాల్గొనడం భారతీయ తత్త్వశాస్త్రం మరియు తెలుగు ప్రజల ప్రతిభను ప్రపంచ వేదికపై ప్రతిష్టాత్మకంగా నిలబెట్టింది.

59
839 views

Comment