logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పార్వతీపురంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి...విగ్రహావిష్కరణ కార్యక్రమం

పార్వతీపురం మన్యం జిల్లా...

పార్వతీపురం.....

పార్వతీపురంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి...విగ్రహావిష్కరణ కార్యక్రమం...

ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, మంత్రి సంధ్యారాణి, బోనెల విజయచంద్ర, తోయిక జగదీశ్వరి, నిమ్మక జయకృష్ణ తదితరులు

- బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపు రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విజయచంద్ర క్యాంప్ కార్యాలయం నుంచి నవీరి కాలనీ వై జంక్షన్ వరకు బైక్ ర్యాలీ...

- ర్యాలీ లో పాల్గొన్న మాధవ్, ఎమ్మెల్యే విజయచంద్ర, కూటమి నాయకులు

అనంతరం వై జంక్షన్ వద్ద 7.50 అడుగుల అటల్ బీహారి వాజపేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన మాధవ్, ఎమ్మెల్యే విజయచంద్ర


మాధవ్ మాట్లాడుతూ....
. ఎమ్మెల్యే విజయ్ చంద్ర కృషితోనే పార్వతీపురంలో వాజ్ పేయి విగ్రహం ఏర్పాటు చేశారు


- రెండు ఎంపీ సీట్లు తో మొదలు పెట్టి కేంద్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీని బలోపేతం చేసి అధికారం లోకి తీసుకొచ్చిన రాజకీయ దురంధరుడు వాజపేయి

- 70 ఏళ్ళు సామాజిక జీవితం గడిపిన నేత వాజపేయి

- శత్రువులు లేని మహనీయుడు ఆయన

- వాజపేయి పరిపాలన అందరికీ ఆదర్శం

- దేశం కోసం రాజి లేని పోరాటం చేసిన వ్యక్తి

- గోవా ను దేశంలో విలీనం కోసం పోరాడిన వ్యక్తి ఆయనే...

- శత్రు దేశాలతో పోరాడాలంటే ఆటం బాంబు ఉండాలని చెప్పిన వ్యక్తి...వాజపేయి... అణుబాంబు ను మన దేశం లో ఉండేలా చేశారు

- టెలికాం విప్లవం తెచ్చిన వ్యక్తి వాజపేయి...

- స్నేహశీలి, దేశంలో సుపరిపాలన అందించిన మహనీయుడు

- ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ...

ఇంట్లో ఏదైనా వజ్రం ఉంటే ఎంత ముఖ్యమో దేశానికి వాజ్ పేయి అటువంటి వ్యక్తి అని కొనియాడారు

ప్రతిపక్షంలో ఉన్న కూడా అప్పట్లో ఇందిరాగాంధీని పొగిడిన వ్యక్తి వాజ్ పేయి

వాజ్పేయి లాంటి ప్రధాని మన దేశానికి సేవ చేయడం మన దేశానికి గర్వకారణం

ఎంతోమంది రాజకీయ నాయకులు పుడుతుంటారు మరణిస్తుంటారు... కానీ వాజ్ పేయి లాంటి రాజకీయ నేత స్నేహశీలి ఉండరు.
ఈ కార్యక్రమంలో టిడిపి అరకు పార్లమెంటరీ అధ్యక్షురాలు తేజోవతి, టిడిపి, బిజెపి, జనసేన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

20
618 views

Comment