logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఎన్‌టిపిసి లో వింటర్ జెమ్ కార్యక్రమం ముగింపు

పెద్దపల్లి, గోదావరిఖని, జనవరి 12 తెలంగాణ రిపోర్టర్: జెమ్ విద్యార్థుల కోసం నిర్వహించిన శీతాకాల శిక్షణా కార్యక్రమం ముగింపు వేడుకతో ఎన్‌టిపిసి పిటిఎస్‌లోని కాకతీయ ఆడిటోరియంలో వింటర్ జెమ్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన మరియు ఎన్‌టిపిసి గీతాలాపనతో ప్రారంభమైంది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆర్&టి) చందన్ కుమార్ సమంత, డిఎంఎస్ అధ్యక్షురాలు రాఖీ సమంతతో కలిసి పాల్గొన్నారు. హెచ్‌ఆర్ హెడ్ బిజోయ్ కుమార్ సిక్దర్ సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ మరియు సంపూర్ణ అభివృద్ధిని పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాల ప్రాముఖ్యతను తెలియజేశారు.జెమ్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో తాము నేర్చుకున్న విషయాలను మరియు సృజనాత్మకతను ప్రదర్శిస్తూ సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసినందుకు గుర్తింపుగా పాల్గొన్న వారికి ధృవపత్రాలు పంపిణీ చేశారు. జెమ్ 2025 ముగింపు సందర్భంగా ఈడీ (ఆర్&టి) కూడా తన ఆలోచనలను మరియు అభిప్రాయాలను పంచుకున్నారు.
డిజిఎం (హెచ్‌ఆర్) ప్రవీణ్ కుమార్ చౌదరి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. వింటర్ జెమ్ కార్యక్రమం సమాజ అభివృద్ధి మరియు యువత సాధికారత పట్ల ఎన్‌టిపిసి యొక్క నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తున్నారు.

20
753 views

Comment